MP Mahdavi ఏపీ అధికార పార్టీ వైకాపా నుండి చాలా మంది ఎంపీలే ఉన్నారు. పార్లమెంట్ లో టాప్ 5 పార్టీల్లో వైకాపా నిలిచేంతగా ఆ పార్టీకి ఎంపీలు ఉన్నారు. సంఖ్య భారీగానే ఉన్నా అందులో పని చేసే వారు మాత్రం ఇద్దరు ముగ్గురే. ఎంపీలు అందరికి కూడా బిజినెస్ లు ఉండటంతో నియోజక వర్గం పరిధిలోని సమస్యలు వారికి పట్టడం లేదు. వారు కనీసం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా ఎవరి ఇష్టం వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పలువురు ఎంపీలపై తీవ్ర కోపంతో ఉన్నారు. అయితే అరకు ఎంపీ గొట్టేటి మాధవి MP Mahdavi మాత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. ఆమె కు పార్టీ అధినాయకత్వం వద్ద కూడా మంచి పేరు దక్కింది.
వైకాపా ఎంపీల్లో పలువురు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి అయినా అధ్యక్షా అంటూ నిలిచింది లేదు కనీసం ప్రశ్న అడిగింది లేదు. కాని మాధవి మాత్రం పలు సార్లు గిరిజన సమస్యలపై మాట్లాడారు. ఆమె విద్యావంతురాలు అవ్వడం వల్ల పలు విషయాలపై పూర్తి అవగాహణ ఉంది. దాంతో ఆమె అన్ని విధాలుగా పార్లమెంట్ లో స్పందించేందుకు ముందు ఉండే వారు. పార్లమెంట్ కమిటీ ల్లో కూడా మెంబర్ గా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇక నియోజక వర్గంలో ప్రజల గురించి ఎప్పుడు ఆమె పరితపిస్తూనే ఉంటుంది. పలు ప్రాంతాలకు కనీస రోడ్లు లేకపోవడంతో తన నిధులను ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేయించింది.
నియోజక వర్గంలో ప్రజలను మరియు కార్యకర్తలను సమన్యయంతో చూసుకుంటూ గ్రామ వాలంటీర్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆమె అభివృద్ది పథంలో తన నియోజక వర్గంను ముందుకు తీసుకు వెళ్లడం పట్ల జగన్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మళ్లీ కూడా ఆమెనే అరకు లో ఎంపీగా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతి ఒక్క ఎంపీ కూడా ఆమెను చూసి నేర్చుకోవాలంటూ జగన్ ఇతర ఎంపీలకు సూచించాడట. ప్రజా సమస్యలపై స్పందించని ఎంపీలకు కాస్త ఘాటుగానే సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.