Uttar Pradesh : ప్రభుత్వ ఉద్యోగి పాడు పని.. ఆ మహిళా ఉద్యోగిపై అక్కడ టచ్ చేస్తూ.. వీడియో..!!
Uttar Pradesh : ప్రస్తుత రోజుల్లో అత్యాచారాలు మరింత దారుణంగా విరిగిపోయాయి. వయసుతో వావి వారసులతో సంబంధం లేకుండా మృగాలు రెచ్చిపోతున్నారు. ఆడది గుమ్మం దాటితే పరిస్థితి చేయి దాటిపోయినట్టు అనే కాన్సెప్ట్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇళ్లల్లోనే తోబుట్టువులు సైతం కామంతో కళ్ళు మూసుకుపోయి… అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక ఉద్యోగాలకు వెళ్లి ఆడవాళ్ళ గురించి..వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణాతీతం. ఈ రకంగానే లేటెస్ట్ గా ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో ఓ ఘటన జరిగింది. విషయంలోకి వెళ్తే 65 సంవత్సరాల వయసున్న రామ్ నాథ్ రామ్ అనే ప్రొబేషన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఉన్నతమైన పదవుల్లో ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ పెద్ద మనిషి… కామంతో రగిలిపోతూ ఓ మహిళ ఉద్యోగి జీవితాన్ని పాడు చేయడానికి యత్నించాడు. మేటర్ లోకి వెళ్తే ఇతగాడు పనిచేస్తున్న కార్యాలయంలోనే ఓ మహిళా ఉద్యోగి… విధులు నిర్వహిస్తోంది. ఈ దుర్మార్గుడు ఎప్పటినుండో ఆ మహిళపై కన్నేసి ఏలాగైన లోపర్చుకుని కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో అనేక ప్రయత్నాలు చేసినా గాని అవి పెద్దగా సఫలీకృతం కాలేదు. అయితే ఈసారి పక్కా ప్లానింగ్ తో తన ఆఫీసు గదిలోకి ఆ మహిళను ఒంటరిగా పిలిపించుకున్నాడు. పథకం ప్రకారం ఆ మహిళతో మాట్లాడుతున్నట్లుగా
Uttar Pradesh Touching the female employee there in Video
నటించి మెల్లగా ఆమె ప్రైవేట్ పార్ట్ పై చేతులు వేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇతని పాడు చేష్టలను గమనించిన ఆ యువతి అతడి ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆఫీసులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విషయం వైరల్ కావడంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీ సమాజ్ వాదీ నేతలు దృష్టిదాక వెళ్లడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో సదరు మహిళ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. సతరు మహిళపై రామ్నాథ్ రామ్ అఘాయిత్యానికి పాల్పడటం వీడియో వైరల్ అవుతుంది.
