
#image_title
Heroine | ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కటి రెండు సినిమాలతోనే స్టార్డమ్ను సాధించిన ఈ తారలు ఇప్పుడు మళ్లీ ఒకే వేదికపై కలుసుకుని ఆ గుర్తులను మళ్లీ జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా 90వ దశకంలో దుమ్మురేపిన సినీ తారల రీయూనియన్ గోవాలో ఘనంగా జరగగా, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.
#image_title
ఎవరంటే..
ఈ రీయూనియన్ పార్టీలో సిమ్రాన్, మీనా, సంఘవి, శ్వేతా మీనన్, సంగీత, ఊహ, మహేశ్వరి వంటి టాప్ హీరోయిన్లు పాల్గొన్నారు. అలాగే హీరోలలో శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభుదేవా, దర్శకులుగా శంకర్, కె.ఎస్.రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అయితే వీరిలో ఒక ఫోటో మాత్రం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.ఈ ఫోటోలో సిమ్రాన్, మీనా మధ్య నడుమ కనిపిస్తున్న హీరోయిన్ను గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు… ఒకప్పటి అందాల తార రీమా సేన్. చాలా కాలంగా ప్రజల కంటపడని ఆమె ఒక్కసారిగా ఇలా ప్రత్యక్షం కావడంతో నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
2000ల ప్రారంభంలో దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రీమా సేన్. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సరసన నటించిన ‘మనసంతా నువ్వే’ సినిమాలో ఆమె నటనకు, జోడీకి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ బ్లాక్బస్టర్ విజయం ఆమె కెరీర్కు పునాది వేసింది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.