
guntur east ysrcp mla musthafa brother house raided
YCP MLA : సీబీఐ, ఈడీ, ఐటీ అధికారుల దాడులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. మన దగ్గరే కాదు.. దేశవ్యాప్తంగా ఈ దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇటీవలే ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కట్ చేస్తే ఏఫీలోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫాకి చెందిన ఫ్యామిలీ మెంబర్స్,
guntur east ysrcp mla musthafa brother house raided
బంధువుల ఇంటిపై వరుసగా దాడులు జరిగాయి.ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో, ఆయన ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. నిజానికి.. ముస్తఫా సోదరుడు కనుమ.. అంజుమన్ కమిటీ అధ్యక్షుడు. ముస్తఫాకి చెందిన కొన్ని లావాదేవీల్లోనూ కనుమ పర్యవేక్షిస్తుంటారట. అందుకే.. ఐటీ అధికారులు ముస్తఫా సోదరుడి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ముస్తఫాకు పొగాకు వ్యాపారం ఉంది. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి వాళ్లు పొగాకు వ్యాపారంలో ఉన్నారు.
రెండు బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు అందుకే ముస్తఫా వ్యాపారం లావాదేవీలను చెక్ చేశారు. ముస్తఫా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన వ్యాపార లావాదేవీలను కనుమ చూసుకుంటున్నారు. అందుకే.. ఇప్పుడు ఐటీ అధికారులు ఇద్దరినీ ఫోకస్ చేశారు. ముస్తఫా రెండు సార్లు వైసీపీ నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ సారి ఆయన పోటీ చేస్తారా లేదా అనేది తెలియదు కానీ.. ఆయన కూతురుకి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఐటీ దాడులతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.