PM Modi : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల కోసం చాలా పథకాలను తీసుకొచ్చింది. పేదలకు ఉండటానికి ఇల్లు, పని చేసుకోవడానికి పని కల్పించడం, రేషన్ బియ్యం, ఇతర సరుకులు, పింఛన్ ఇలా పలు రకాలుగా పేదలకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం. అయితే.. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయపడుతోంది ప్రభుత్వం.
ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవడానికి పీఎం ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం.ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉంటే ఆ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. సంవత్సరానికి మూడు లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్లు పీఎం ఆవాస్ యోజన అనే పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కింద అర్హులు అయిన వాళ్లకు రూ.2.50 లక్షల సాయం అందిస్తారు. అయితే.. ఈ సబ్సిడీ మూడు విడుతల్లో విడుదల అవుతుంది. మొదటి విడతగా రూ.50 వేలు, రెండో విడతగా రూ.1.50 లక్షలు, మూడో విడతగా మరో రూ.50 వేలు విడుదల చేస్తారు. రెండున్నర లక్షల్లో ఒక లక్ష మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు వస్తాయి. దీనికి మీరు అర్హులు అయితే.. వెంటనే ఈ పథకం కింద అప్లయి చేసుకొని ఇల్లు కట్టేసుకోండి.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.