ప్రస్తుతం మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకపక్క టెక్నాలజీ పెరుగుతున్న మరోపక్క జనాలు కొన్ని విషయాలలో అజ్ఞానంగానే ఆలోచిస్తున్నారు. ఇంత పెద్ద చదువులు చదివిన కొన్ని విషయాలలో ఆ జ్ఞానాన్ని ప్రదర్శించలేరు. దీంతో జనాలని మోసం చేసేలా ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను నమ్మి ఎంతోమంది మోసపోతున్నారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసేవారు ఎప్పుడు ఉంటనే ఉంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది అసలు జనకన్యలు ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. అలాంటిది కోట్ల విలువ చేసే జలకన్య కన్ను ఇది మీ ఇంట్లో
ఉంటే డబ్బే డబ్బు అంటూ మోసగాళ్లు రంగంలోకి దిగారు. జనాలను మోసం చేయాలనుకున్న వాళ్లు చివరికి పోలీసులకు పట్టు పడ్డారు. ఈ సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కాజీపేట కు చెందిన చందు అనే 30 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మల్కాజిగిరిలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి అల్వాల్ కి చెందిన తాపీ మేస్త్రి మడికొండ సాంబశివరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి డబ్బు కావాలి.
చిన్న ఉద్యోగాలతో డబ్బు సంపాదించడం కష్టమని ఆలోచించారు. దీంతో ఇద్దరు కలిసి జనాలను మోసం చేయడానికి ప్లాన్ వేశారు. ఇద్దరు కలిసి జలకన్య కన్ను ఇది లక్కీ స్టోన్, దీనికి అద్భుత శక్తులు ఉన్నాయి. మీ ఇంట్లో ఉంటే మంచిది. మార్కెట్లో దీని విలువ రెండు కోట్లు, కానీ తాము తక్కువ ధరకే ఇస్తామని జనాలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ లక్కీ స్టోన్ సమాచారం కాస్త పోలీసులకు తెలియడంతో ఆ ఇద్దరిని పట్టుకొని పోలిసులు విచారించారు. వారి వద్ద నుండి జలకన్య కన్ను అనుకుంటున్న వస్తువు, మూడు మొబైల్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.