is gurumurthy strength for ysrcp in tirupati bypoll
Tirupati bypoll : ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉపఎన్నిక గురించే చర్చ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్. సోషల్ మీడియాలోనూ తిరుపతి ఉప ఎన్నిక టాపికే ట్రెండింగ్ లో ఉంది. నిజానికి ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ… ఎంపీ కానీ.. ఇతర పదవుల్లో ఉన్నవాళ్లు కానీ చనిపోతే… ఆయా కుటుంబంలోకి వారికే టికెటు ఇస్తుంటాయి పార్టీలు. ఎందుకంటే సానుభూతితో మళ్లీ ఆ కుటుంబంలోని వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారని భావించి.. ప్రతిపక్ష పార్టీలకు చాన్స్ ఇవ్వకుండా చూస్తారు. తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ చనిపోయిన ఎమ్మెల్యే సోలిపేట భార్యకే టికెట్ ఇచ్చింది. సాగర్ ఉపఎన్నికలోనూ అంతే. టీఆర్ఎస్ పార్టీ చనిపోయిన ఎమ్మెల్యే నోముల కొడుకు భగత్ కు టికెట్ ఇచ్చింది. కొన్ని సార్లు సానుభూతి వర్కవుట్ కావచ్చు… కాకపోవచ్చు.. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వర్కవుట్ కాలేదు. ఏది ఏమైనా.. చనిపోయిన నాయకుడి కుటుంబంలోని ఒకరికే టికెట్ ఇవ్వడం అనేది చాలా ఏళ్ల నుంచి వస్తోంది.
is gurumurthy strength for ysrcp in tirupati bypoll
అయితే.. తిరుపతి ఉపఎన్నికల్లో మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. చనిపోయిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కొడుకుకు వైపీపీ టికెట్ ఇవ్వలేదు. దుర్గా ప్రసాద్ కొడుకు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ… ఆయనకు కాకుండా అసలు రాజకీయాలే తెలియని గుర్తుమూర్తికి వైసీపీ టికెట్ కన్ఫమ్ చేసింది. అయితే… బల్లి దుర్గా ప్రసాద్ కొడుకు కల్యాణ్ కు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని సీఎం జగన్ మాటివ్వడం వల్ల… తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వలేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అదంతా బాగానే ఉంది కానీ… వైసీపీ బరిలోకి దింపిన గురుమూర్తి ఒక డాక్టర్. ఆయనకు రాజకీయాలు తెలియవు. అదే ఇప్పుడు వైసీపీకి లేనిపోని తలనొప్పులను తీసుకొస్తోంది.
అసలే రాజకీయాలకు కొత్త అయిన గురుమూర్తి ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా మాట్లాడటం లేదు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కు పెట్టడం లేదు. ఆయన అభ్యర్థి కాబట్టి.. కాస్తయినా నోరు విప్పాలి కానీ… ఆయన గొంతే విప్పకపోవడంతో వైసీపీలో లేనిపోని కలవరం స్టార్ట్ అయింది. మరోవైపు ప్రచారంలో టీడీపీ, బీజేపీ నేతలు దూసుకెళ్తుంటే గురుమూర్తి మాత్రం కనీసం ప్రచారంలోనూ యాక్టివ్ గా లేరని వైసీపీ నేతలు అంటున్నారు. చివరకు సీఎం జగన్ ప్రచార సభ కూడా క్యాన్సిల్ కావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక… వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలు.. వైసీపీకి గురుమూర్తి ప్లస్ అయ్యారా? మైనస్ అయ్యారా? అనే విషయం తెలియక… అంతా గందరగోళం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో మాత్రం వైసీపీ కాస్త వెనకపడినట్టే అనిపిస్తోంది. మరి… తిరుపతి ప్రజలు గురుమూర్తిని స్వాగతిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
This website uses cookies.