
Jaipur Belt: వెన్నునొప్పి..! ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లమందిని ఈ సమస్య వేధిస్తున్నది. వ్యక్తులపైనా, వివిధ సంస్థల యాజమాన్యాలపైనా, సమాజంపైనా ఈ వెన్నునొప్పి అనేది ప్రధాన ఆరోగ్య భారంగా కొనసాగుతున్నది. ఈ సమస్య పరిశ్రమల్లో పనిచేసే కార్మికులపైనా, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలపైనా, వ్యవసాయ కూలీలపైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్లలో ఈ వెన్నునొప్పి అనేది సర్వసాధారణమైనదిగా మారిపోయింది.
వాస్తవం చెప్పాలంటే ఈ మధ్య జరిగిన ఓ అధ్యయనంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 60 శాతం మందికిపైగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని తేలింది. ఇక రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలోని న్యూండ్రా గ్రామంలో కూడా స్థానికులను వెన్నునొప్పి సమస్య వేధిస్తున్నది. ఆ గ్రామస్తులు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనులు చేస్తుంటారు.
అదే గ్రామానికి చెందిన 18 ఏండ్ల గణేశ్ రామ్ జాంగీర్ కూడా తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి స్కూల్ అయిపోగానే కుటుంబసభ్యులతో కలిసి సజ్జ చేనులో పని చేసేవాడు. అప్పుడు అతనికి వెన్నులో తీవ్రమైన నొప్పి వచ్చేది. తనతోపాటు తన తల్లిదండ్రులు కూడా ఆ బాధను అనుభవించడం చూశాడు. అంతేకాదు, ఆ గ్రామంలో చాలామంది చేను పనుల కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నాడు.
ఈ విషయమై గణేశ్ రామ్ జాంగీర్ తన తల్లిదండ్రులతో చర్చించగా.. తాము గత కొన్నేండ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నామని చెప్పారు. వెన్నునొప్పి భరించలేకుండా వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం లేదంటే రిలీఫ్ కోసం జెండూ బామ్ లాంటి క్రీమ్లు రాసుకునేవాళ్లమని తెలిపారు. మరి ఆస్పత్రికి వెళ్లొచ్చుగా అని ప్రశ్నించగా.. ఆస్పత్రులకు వెళ్తే తమ వ్యవసాయ పనులు దెబ్బతింటాయని చెప్పారు.
వైద్యులను సంప్రదిస్తే ఏం చేస్తారు..? ఏం పని చేస్తుంటారని అడుగుతారు. వ్యవసాయం అని చెబితే.. నడుము నొప్పి తగ్గాలంటే కొన్నాళ్లు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలని చెబుతారు. మరి వాళ్లు చెప్పినట్టు చేస్తే బతుకు గడువదు అని గణేశ్ రామ్ తల్లిదండ్రులు చెప్పారు. ఈ సమాధానం గణేశ్ రామ్ జాంగీర్ మనసులో కొత్త ఆలోచనలకు తెరతీసింది. తనకు ఎలాంటి వ్యాపార, పారిశ్రామిక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈ వెన్నునొప్పి సమస్యకు శాశ్వాత పరిష్కారం కనుగొనాలని బలంగా నిర్ణయించుకున్నాడు.
వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం కోసం గణేశ్ రామ్ నిర్విరామంగా కృషి చేశాడు. దాదాపు ఎనిమిదేండ్లపాటు అంకితబావంతో పనిచేసిన తర్వాత ఈ సామాజిక పారిశ్రామికవేత్త 2016లో న్యూండ్రా ఇన్నోవేషన్స్ను ప్రారంభించాడు. తన సంస్థ ద్వారా జైపూర్ బెల్ట్ అనే ప్రోడక్ట్ను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేశానని చెప్పాడు. విద్యుత్ అవసరంలేని ఈ తేలికైన జైపూర్ బెల్ట్ బాధితులకు బాహ్య అస్థిపంజరంలా పనిచేస్తుందన్నాడు. ఈ జైపూర్ బెల్టు వినియోగం ద్వారా వెన్నుపై 50 శాతం భారం తగ్గుతుందని తెలిపాడు.
కాగా, గణేశ్ రామ్ జాంగీర్ ఉత్పత్తి చేసిన ఈ జైపూర్ బెల్టుకు 2019లో తొమ్మిది దేశాల్లో పేటెంట్ హక్కులు లభించాయి. ఆయా దేశాల మార్కెట్లలో ఇప్పుడు వాటికి మంచి డిమాండ్ కూడా ఉన్నది. తాజాగా ఈ జైపూర్ బెల్టులను తమ కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. త్వరలోనే ఈ-కామర్స్ వెబ్సైట్లు, దుకాణాలు, ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా ఈ బెల్టులను విక్రయించేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.