
Jaipur Belt: వెన్నునొప్పి..! ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లమందిని ఈ సమస్య వేధిస్తున్నది. వ్యక్తులపైనా, వివిధ సంస్థల యాజమాన్యాలపైనా, సమాజంపైనా ఈ వెన్నునొప్పి అనేది ప్రధాన ఆరోగ్య భారంగా కొనసాగుతున్నది. ఈ సమస్య పరిశ్రమల్లో పనిచేసే కార్మికులపైనా, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలపైనా, వ్యవసాయ కూలీలపైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్లలో ఈ వెన్నునొప్పి అనేది సర్వసాధారణమైనదిగా మారిపోయింది.
వాస్తవం చెప్పాలంటే ఈ మధ్య జరిగిన ఓ అధ్యయనంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 60 శాతం మందికిపైగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని తేలింది. ఇక రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలోని న్యూండ్రా గ్రామంలో కూడా స్థానికులను వెన్నునొప్పి సమస్య వేధిస్తున్నది. ఆ గ్రామస్తులు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనులు చేస్తుంటారు.
అదే గ్రామానికి చెందిన 18 ఏండ్ల గణేశ్ రామ్ జాంగీర్ కూడా తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి స్కూల్ అయిపోగానే కుటుంబసభ్యులతో కలిసి సజ్జ చేనులో పని చేసేవాడు. అప్పుడు అతనికి వెన్నులో తీవ్రమైన నొప్పి వచ్చేది. తనతోపాటు తన తల్లిదండ్రులు కూడా ఆ బాధను అనుభవించడం చూశాడు. అంతేకాదు, ఆ గ్రామంలో చాలామంది చేను పనుల కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నాడు.
ఈ విషయమై గణేశ్ రామ్ జాంగీర్ తన తల్లిదండ్రులతో చర్చించగా.. తాము గత కొన్నేండ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నామని చెప్పారు. వెన్నునొప్పి భరించలేకుండా వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం లేదంటే రిలీఫ్ కోసం జెండూ బామ్ లాంటి క్రీమ్లు రాసుకునేవాళ్లమని తెలిపారు. మరి ఆస్పత్రికి వెళ్లొచ్చుగా అని ప్రశ్నించగా.. ఆస్పత్రులకు వెళ్తే తమ వ్యవసాయ పనులు దెబ్బతింటాయని చెప్పారు.
వైద్యులను సంప్రదిస్తే ఏం చేస్తారు..? ఏం పని చేస్తుంటారని అడుగుతారు. వ్యవసాయం అని చెబితే.. నడుము నొప్పి తగ్గాలంటే కొన్నాళ్లు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలని చెబుతారు. మరి వాళ్లు చెప్పినట్టు చేస్తే బతుకు గడువదు అని గణేశ్ రామ్ తల్లిదండ్రులు చెప్పారు. ఈ సమాధానం గణేశ్ రామ్ జాంగీర్ మనసులో కొత్త ఆలోచనలకు తెరతీసింది. తనకు ఎలాంటి వ్యాపార, పారిశ్రామిక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈ వెన్నునొప్పి సమస్యకు శాశ్వాత పరిష్కారం కనుగొనాలని బలంగా నిర్ణయించుకున్నాడు.
వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం కోసం గణేశ్ రామ్ నిర్విరామంగా కృషి చేశాడు. దాదాపు ఎనిమిదేండ్లపాటు అంకితబావంతో పనిచేసిన తర్వాత ఈ సామాజిక పారిశ్రామికవేత్త 2016లో న్యూండ్రా ఇన్నోవేషన్స్ను ప్రారంభించాడు. తన సంస్థ ద్వారా జైపూర్ బెల్ట్ అనే ప్రోడక్ట్ను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేశానని చెప్పాడు. విద్యుత్ అవసరంలేని ఈ తేలికైన జైపూర్ బెల్ట్ బాధితులకు బాహ్య అస్థిపంజరంలా పనిచేస్తుందన్నాడు. ఈ జైపూర్ బెల్టు వినియోగం ద్వారా వెన్నుపై 50 శాతం భారం తగ్గుతుందని తెలిపాడు.
కాగా, గణేశ్ రామ్ జాంగీర్ ఉత్పత్తి చేసిన ఈ జైపూర్ బెల్టుకు 2019లో తొమ్మిది దేశాల్లో పేటెంట్ హక్కులు లభించాయి. ఆయా దేశాల మార్కెట్లలో ఇప్పుడు వాటికి మంచి డిమాండ్ కూడా ఉన్నది. తాజాగా ఈ జైపూర్ బెల్టులను తమ కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. త్వరలోనే ఈ-కామర్స్ వెబ్సైట్లు, దుకాణాలు, ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా ఈ బెల్టులను విక్రయించేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
This website uses cookies.