
janasena mla rapaka varaprasad comments on cm jagan
Rapaka Varaprasad : ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ ప్రజల కోసం పని చేస్తోందో చూడాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలకు తెలుస్తుంది. ప్రభుత్వం తప్పు ఉంటే ప్రభుత్వానికి తెలుస్తుంది. మీడియా తప్పు ఉంటే మీడియాకు తెలుస్తుంది. అందుకే.. నేను ఎటువైపు ఉండాలో తేల్చుకున్నా.. అంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఆయన జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ.. జనసేన పార్టీకి దూరమైన ఆయన ఇప్పుడు వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీ పార్టీలో చేరకున్నా..
janasena mla rapaka varaprasad comments on cm jagan
ఆ పార్టీ తరుపున పని చేస్తూ.. జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను అభినందించారు. కులాలను అంటి పెట్టుకొని విధంగా ముందుకెళ్తే ప్రజలకు న్యాయం జరగదు. కానీ.. జగన్ మోహన్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడిన రాపాక వరప్రసాద్.. సీఎం జగన్ ను డైరెక్ట్ గా పొగిడేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. మార్పు రావాలి.. మార్పు తెచ్చుకోవాలి అన్నారు. పట్టాభి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారని పెద్ద పత్రిక రాసింది.
మళ్లీ అదే పత్రిక సవరణ చేసుకుంది. ఈ ప్రభుత్వం మీద కావాలని బురద జల్లుతున్నారు. మనం ఏ పని చేసినా కొంచెమైనా ఆలోచన ఉండాలి. ప్రజలు కష్టాల్లో ఉంటే మీడియా వచ్చి ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ.. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు జగన్ ని కోరుకుంటున్నారు. అందుకే తాను జగన్ వైపు ఉన్నానని రాపాక చెప్పకనే చెప్పేశారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే రాపాక పోటీ చేసే అవకాశం ఉందని ఆయన మాటలతో తెలిసిపోతోంది.
Foods High in Gelatin : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, చర్మంపై ముడతలు వంటి…
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
This website uses cookies.