Cm Covid Positive : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో నమోదవుతున్న కేసులు.. మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తాజాగా.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కరోనా కలకలం రేపింది. ముఖ్యమంత్రి సతీమణితో పాటు వారి ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పుడీ అంశం ఝార్ఖండ్ లో చర్చనీయాంశంగా మారింది.
జాగ్రత్తలు పాటించే సీఎం ఇంట్లోనే కరోనా కేసులు ఈ స్థాయిలో ఉంటే ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనాలకు అందటం లేదు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సతీమణి కల్పనా సోరెన్, కుమారులు నితిన్, విశ్వజీత్ లతో పాటు ఆయన నివాసంలోని మొత్తం 62 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కేసులు బయట పడినట్లు తెలుస్తోంది. అయితే వారిలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు స్పష్టం చేశారు.
పాజిటివ్ గా తేలిన వారందరికీ స్వల్ప లక్షణాలే ఉండటంతో వారందరూ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్లోనే ఉన్నట్లు సమాచారం. భారత్ లో గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.