Jio and Airtel | వరద బాధితులకి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన జియో, ఎయిర్టెల్
Jio and Airtel | తీవ్రమైన వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ప్రభావితమవుతున్న తరుణంలో, సంబంధిత ప్రాంతాల ప్రజలకు కమ్యూనికేషన్ సపోర్ట్ అందించేందుకు టెలికాం సంస్థలు ముందుకొచ్చాయి. కనెక్టివిటీ సమస్యలను తగ్గించేందుకు జియో మరియు ఎయిర్టెల్ వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి.
#image_title
జియో ప్రకటించిన ప్రత్యేక సదుపాయాలు:
ప్రీపెయిడ్ వినియోగదారులకు 3 రోజుల చెల్లుబాటు పొడిగింపు.
ఈ మూడు రోజుల పాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ ఉచితం.
జియో హోమ్ వినియోగదారులకు కూడా సేవల్లో అంతరాయం కలగకుండా అదనంగా 3 రోజుల పొడిగింపు.
పోస్ట్పెయిడ్ వినియోగదారులకు బిల్లుల చెల్లింపుల్లో 3 రోజుల గ్రేస్ పీరియడ్, ఎటువంటి సేవా అంతరాయం లేకుండా కాల్స్, డేటా ఉపయోగించుకునే అవకాశం.
ఎయిర్టెల్ ప్రకటించిన సౌకర్యాలు:
ప్రీపెయిడ్ కస్టమర్లకు అపరిమిత కాలింగ్, రోజుకు 1GB డేటా 3 రోజుల చెల్లుబాటు పొడిగింపు.
పోస్ట్పెయిడ్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు కూడా 3 రోజుల గ్రేస్ పీరియడ్, కనెక్టివిటీకి అంతరాయం కలగకుండా చూస్తుంది.
సెప్టెంబర్ 2 వరకు, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇంట్రా-సర్కిల్ రోమింగ్ ప్రారంభించేందుకు టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. దీని ద్వారా వినియోగదారులు తమ టెలికాం నెట్వర్క్ పనిచేయకపోతే, అందుబాటులో ఉన్న ఇతర నెట్వర్క్లను స్వయంచాలకంగా ఉపయోగించుకోగలగడం సాధ్యమవుతుంది.ఈ చర్యల ద్వారా వరదల కారణంగా విడిపోయిన ప్రజలకు కనీసం కమ్యూనికేషన్ కనెక్టివిటీ దూరం కాకుండా ఉండేలా టెలికాం సంస్థలు, ప్రభుత్వం కలసి పని చేస్తున్నాయి.