
journalists are leaving journalism profession
Journalism : జర్నలిజం లేదా పాత్రికేయం అనేది ప్రజలకు ఒక భరోసా. ఎందుకంటే.. ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను, నష్టాలను ప్రపంచానికి, ప్రభుత్వానికి, అధికారులకు తెలిసేలే చేసేదే జర్నలిజం. కానీ.. ఒకప్పుడు జర్నలిజంలా లేదు నేటి జర్నలిజం. అంతటా అవినీతి రాజ్యమేలుతున్న ఈరోజుల్లో పత్రికలు కూడా ప్రభుత్వాలకు, వ్యక్తులకు దాసోహం అంటున్నాయి. దీంతో నిఖార్సయిన వార్తలు రాసే స్వేచ్ఛ నేడు ఏ జర్నలిస్టుకు లేదు. ప్రస్తుతం జర్నలిజంలో సంక్షోభం మొదలైందని అంటున్నారు. కేవలం రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ.. కొందరు వ్యక్తులకు, ప్రభుత్వాలకు కొమ్ముకాస్తూ నడిపిస్తున్న
పత్రికల్లో పని చేసేందుకు నిఖార్సయిన జర్నలిస్టులు సుముఖత చూపడం లేదు.ధైర్యంగా కొందరు వాస్తవాలు రాయడానికి ప్రయత్నించినా అది కుదరడం లేదు. అందుకే జర్నలిజానికే గుడ్ బై చెబుతున్నారు కొందరు జర్నలిస్టులు. జర్నలిజం విలువలను దిగజార్చడం కంటే ఆ వృత్తిని వదిలేయడమే మేలు అని అనుకుంటున్నారు నేటి జర్నలిస్టులు. మరికొందరు మాత్రం పొట్ట కూటి కోసం, కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో తమ మనసు చంపుకొని ఆ వృత్తిలో కొనసాగాల్సి వస్తోంది. నేడు రోజూ కూలీకి కనీస వేతనం లభిస్తోంది. కానీ.. ఒక జర్నలిస్ట్ వేతనం కూలీ కన్నా తక్కువగా ఉంది.
journalists are leaving journalism profession
అంతకంటే అధ్వానంగా తయారైంది. నమ్ముకున్న వృత్తి కనీసం కూడు కూడా పెట్టకపోతే వాళ్లు ఏం చేయాలి. అటు గౌరవం లేదు.. ఇటు వేతనం లేదు.. చివరకు నిజాయితీగా పనిచేసే స్వేచ్ఛ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంకా జర్నలిజంలో ఉండాలి. ఈ వృత్తిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది జర్నలిస్టులను వేధిస్తోంది. పాలకుల చేతి నుంచి జర్నలిజానికి స్వేచ్ఛ లభించినప్పుడే ఈ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలా ప్రజలను కాపాడుతున్న జర్నలిజానికి విలువ దక్కుతుంది. లేదంటే జర్నలిజం అనే మాటే భవిష్యత్తులో వినబడదు.
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
This website uses cookies.