kadiyam srihari : వరంగల్ మరియు ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ల్లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీ లు హోరా హోరీగా తలపడబోతున్నాయి. హైదరాబాద్ లో దక్కించుకున్న విజయాలను కంటిన్యూ చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే టీఆర్ఎస్ మాత్రం మళ్లీ జీహెచ్ఎంసీ ఫలితాలను పునరావృతం కాకుండా చూడాలని గట్టి ప్రయత్నాలు చేసింది. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ పడటం ఖాయం అనే నమ్మకంతో బీజేపీ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కడియం శ్రీహరి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. దాంతో ఆ దెబ్బ టీఆర్ఎస్ కు తప్పదని అంటున్నారు.
కడియ శ్రీహరి kadiyam srihari గత కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఒక మంత్రి చేస్తున్న డామినేషన్ ను ఆయన తట్టుకోలేక పోతున్నాడు. అందుకే టీఆర్ఎస్ కు మద్దతుగా ఎన్నికల్లో కడియం మరియు ఆయన వర్గీయులు ఎవరు కూడా ప్రచారం చేసింది లేదు. పార్టీ ముఖ్య నాయకులు అంతా కూడా అక్కడ ప్రచారానికి వెళ్తే అక్కడే ఉన్న కడియం మాత్రం ఏదో కారణం చెప్పి దూరంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. కడియం శ్రీహరికి వరంగల్ లో మంచి పట్టు ఉంది. అలాంటి కడియం ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల ఖచ్చితంగా టీఆర్ఎస్ కు నష్టం తప్పదని అంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సత్తా చాటుతుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాని బీజేపీ మాత్రం టీఆర్ఎస్ లో ఉన్న కుమ్ములాటల కారణంగా తమకు కలిసి వస్తుందని అంటున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ మరియు బీజేపీ ముఖ్య నాయకులు భారీ ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ ప్రచారాలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు కడియం టీఆర్ఎస్ కు దూరంగా ఉండటం వల్ల ఫలితాలు కాషాయంకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.