TRS : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో అయితే అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య విభేదాలు.. హైకమాండ్ నేతలపై సీరియస్ అవడం, మంత్రి వర్గం నుంచి తప్పించడం, కొందరు నాయకులు అధిష్ఠానం కావాలని పట్టించుకోకపోవడం.. ఇవన్నీ.. ప్రతిపక్షాలు మంచి సాకుగా దొరుకుతున్నాయి. పార్టీలోనే ఇన్ని సమస్యలు ఉంటే.. వీళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? అంటూ ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం తాను ఏది అనుకుంటే అది చేస్తూ వెళ్లిపోతున్నారు. భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మారోమారు కూడా ఆలోచించకుండా.. నిర్ధాక్షిణ్యంగా.. సీనియర్ నేత, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే.. ఈటలను ఎలా మంత్రి వర్గం నుంచి తొలగించారో.. అలాగే.. మరో ఇద్దరు సీనియర్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరి.. వీళ్లిద్దరూ టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి హయాంలో మంత్రులుగా పనిచేశారు. రెండో సారి టీఆర్ఎస్ పార్టీ గెలిచాక.. వీళ్లకు మంత్రి పదవులు దక్కలేదు సరి కదా.. అసలు.. సీఎం కేసీఆర్ కానీ.. టీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్లను పట్టించుకోవడమే మానేశారు. అసలు.. వీళ్లు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పార్టీ అధికార కార్యక్రమాల్లో కూడా వీళ్లు ప్రస్తుతం పాల్గొనడం లేదు. దీంతో వీళ్లిద్దరికి తోడు ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా కలిశారు. నిజానికి.. ఖమ్మం జిల్లాలో తుమ్మలకు మంచి పట్టు ఉంది. అలాగే.. వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరికి మంచి పట్టు ఉంది. కరీంనగర్ జిల్లాలో ఈటలకు మంచి పట్టు ఉంది. ముగ్గురూ సీనియర్ నేతలు, బాగా పేరున్న నేతలే కానీ.. వీళ్లను మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఇబ్బంది పెడుతూ.. పక్కన పెట్టేసింది.
పేరుకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ.. ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో.. పార్టీ నుంచి బయటికి రావాలని తుమ్మల, కడియం భావిస్తున్నారట. అయితే సరైన సమయం కోసం వాళ్లు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈటల కూడా బయటికి రావడంతో.. ముందు ఈటలతో తుమ్మల, కడియం భేటీ అవ్వాలని యోచిస్తున్నారట. ఈటల రాజేందర్ ను కలిసి.. భవిష్యత్తు కార్యాచరణను రచించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. తుమ్మల బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ముగ్గురు కలిసి ఏదైనా ఒక పార్టీలోకి వెళ్తారా? లేక.. ఈటల పార్టీ పెడితే.. అందులోకి తుమ్మల, కడియం శ్రీహరి వెళతారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.