Ys Sharmila
YS Sharmila : తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత మళ్లీ అంత ట్రెండింగ్ అవుతున్న టాపిక్.. షర్మిల పార్టీ. అసలు.. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు అనేదే చాలా హాట్ టాపిక్. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించాక… తెలంగాణ రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. షర్మిల కూడా తన దూకుడును ప్రారంభించారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. లోటస్ పాండ్ వేదికగా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన షర్మిల… తర్వా ఖమ్మం సభలో సమర శంఖారావం పూరించారు. తనను ఆశీర్వదించాలని ప్రతి తెలంగాణ పౌరుడిని కోరారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని… తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను నిలదీయాలని.. అందుకే పార్టీ పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. త్వరలోనే ఆమె పార్టీ పేరు, పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు.
kancha ilaiah speaks in ys sharmila protest meeting
తన ఖమ్మం సభలో షర్మిల ప్రధానంగా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించే మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. అందుకే కేసీఆర్ ను నిలదీసేందుకే పార్టీ పెడుతున్నట్టు షర్మిల తెలిపారు. అలాగే… ప్రభుత్వ ఉద్యోగాల గురించి కూడా షర్మిల నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇంట్లో ఎవరు ఒకరు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగ నియామకాల కోసం… తాను సంకల్ప దీక్ష చేపడతానని షర్మిల… ఖమ్మం సభలోనే మాటిచ్చారు.
షర్మిల మాటిచ్చినట్టుగానే తాజాగా హైదరాబాద్ లో ఉద్యోగ దీక్షను చేపట్టారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. అయితే షర్మిల 72 గంటల పాటు నిరాహార దీక్షను చేపట్టగా… పోలీసులు మాత్రం తనకు ఒక్క రోజే దీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చారు. షర్మిలకు.. రచయిత కంచె ఐలయ్య తన మద్దతును ప్రకటించారు. కాకతీయ గడ్డ మీద పుట్టిన రుద్రమ దేవి తర్వాత ఇప్పుడు షర్మిలను చూస్తున్నానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
షర్మిలకు తెలంగాణ గడ్డ మీద పార్టీ పెట్టే హక్కు ఉంది. షర్మిల.. సమ్మక్క, సారలమ్మ వారసురాలు. తెలంగాణ మహిళలే షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తారు…. అంటూ కంచె ఐలయ్య స్పష్టం చేశారు. ఈసందర్భంగా కంచె ఐలయ్య… వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ పాలనలో విద్యా రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్బాస్…
This website uses cookies.