
Ys Sharmila
YS Sharmila : తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత మళ్లీ అంత ట్రెండింగ్ అవుతున్న టాపిక్.. షర్మిల పార్టీ. అసలు.. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు అనేదే చాలా హాట్ టాపిక్. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించాక… తెలంగాణ రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. షర్మిల కూడా తన దూకుడును ప్రారంభించారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. లోటస్ పాండ్ వేదికగా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన షర్మిల… తర్వా ఖమ్మం సభలో సమర శంఖారావం పూరించారు. తనను ఆశీర్వదించాలని ప్రతి తెలంగాణ పౌరుడిని కోరారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని… తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను నిలదీయాలని.. అందుకే పార్టీ పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. త్వరలోనే ఆమె పార్టీ పేరు, పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు.
kancha ilaiah speaks in ys sharmila protest meeting
తన ఖమ్మం సభలో షర్మిల ప్రధానంగా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించే మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. అందుకే కేసీఆర్ ను నిలదీసేందుకే పార్టీ పెడుతున్నట్టు షర్మిల తెలిపారు. అలాగే… ప్రభుత్వ ఉద్యోగాల గురించి కూడా షర్మిల నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇంట్లో ఎవరు ఒకరు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగ నియామకాల కోసం… తాను సంకల్ప దీక్ష చేపడతానని షర్మిల… ఖమ్మం సభలోనే మాటిచ్చారు.
షర్మిల మాటిచ్చినట్టుగానే తాజాగా హైదరాబాద్ లో ఉద్యోగ దీక్షను చేపట్టారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. అయితే షర్మిల 72 గంటల పాటు నిరాహార దీక్షను చేపట్టగా… పోలీసులు మాత్రం తనకు ఒక్క రోజే దీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చారు. షర్మిలకు.. రచయిత కంచె ఐలయ్య తన మద్దతును ప్రకటించారు. కాకతీయ గడ్డ మీద పుట్టిన రుద్రమ దేవి తర్వాత ఇప్పుడు షర్మిలను చూస్తున్నానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
షర్మిలకు తెలంగాణ గడ్డ మీద పార్టీ పెట్టే హక్కు ఉంది. షర్మిల.. సమ్మక్క, సారలమ్మ వారసురాలు. తెలంగాణ మహిళలే షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తారు…. అంటూ కంచె ఐలయ్య స్పష్టం చేశారు. ఈసందర్భంగా కంచె ఐలయ్య… వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ పాలనలో విద్యా రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే గుర్తుకు…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ రాజకీయ హీట్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగా…
Egg : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం గుడ్లను చాలా మంది…
No Sugar : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల…
This website uses cookies.