
kcr embracing komatireddy venkat reddy
KCR : పాలిటిక్స్లో ఎవరూ శాశ్వత శత్రువులు కారు, ఎవరూ శాశ్వత మిత్రులు కారు అనే మాట ఊరికెనే రాలదు. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఎంపీ కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్ వేరు వేరు పార్టీలకు చెందిన వారు. రాజకీయాల పరంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుంటారు. కానీ శుక్రవారం జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. ఇదే కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంపై ప్రశంసలు కురిపించారు ఎంపీ కోమటిరెడ్డి.
పరిపాలన సుగుమం కావడానికి 33 జిల్లాలను ఏర్పాటు చేశారని, వాటిలో కలెక్టరేట్ భవనాలను సైతం నిర్మించినందుకు సీఎంకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని సరదాగా గడిపారు. వీరు తీరును చూసి కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత కాలం ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం, దుమ్మెత్తిపోయడం వంటివి వీరిద్దరి మధ్య కనిపించాయి. కానీ ఈ కార్యక్రమంలో వీరిద్దరూ ఒక్కటైపోయారా? అనే విధంగా వీరి సరదాగా ఉన్నారు.
kcr embracing komatireddy venkat reddy
కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడం, రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడంతో అప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. కానీ వీరిద్దరు ఒకే వేదిపై కలిసి నవ్వులు చిందించడంపై రాజకీయంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి జనగామ జిల్లా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం కిందకు వస్తుంది. దీని వల్ల ఆయన ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి హాజరయ్యారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ లోలోపల మాత్రం వీరి కలయికపై ఆయా పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి కేసీఆర్ తో కలిసిపోతారా? అన్న సందేహాలు సైతం వారిని వెంటాడుతున్నాయి.
Central Government : రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా రైతులకు సమగ్ర…
Russia : గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని ఆధిపత్యం చేస్తున్న అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలని రష్యా…
Mad For Each Other Couple Show : బిగ్బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు…
Half-day schools : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభవార్త తెలియజేసింది.…
Pratyusha Death Case : టాలీవుడ్లో విషాదానికి ప్రతీకగా నిలిచిన నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం…
T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్థాన్పై ఆధిపత్యం చాటింది. ఫిబ్రవరి 15న…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆ ఓటింగ్ జరిగిన తీరు…
Income Tax Rules : దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఫారమ్…
This website uses cookies.