క్రిష్ ప్లాన్ సర్వ నాశనం చేసిన కరోనా .. పవన్ కళ్యాణ్ మళ్ళీ జారిపోతాడేమో ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

క్రిష్ ప్లాన్ సర్వ నాశనం చేసిన కరోనా .. పవన్ కళ్యాణ్ మళ్ళీ జారిపోతాడేమో ..?

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం .. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. క్రిష్ ఈ సినిమాని మొఘలాయిల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ కమిటయిన నెక్స్ట్ సినిమా క్రిష్ దే. అయితే ఒకసారి కరోనా కొట్టిన దెబ్బ కి ఈ ప్రాజెక్ట్ దాదాపు 8 నెలలు ఆగిపోయింది. లాక్ […]

 Authored By govind | The Telugu News | Updated on :3 January 2021,1:30 pm

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం .. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. క్రిష్ ఈ సినిమాని మొఘలాయిల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ కమిటయిన నెక్స్ట్ సినిమా క్రిష్ దే. అయితే ఒకసారి కరోనా కొట్టిన దెబ్బ కి ఈ ప్రాజెక్ట్ దాదాపు 8 నెలలు ఆగిపోయింది. లాక్ డౌన్ కి ముందే మొదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ లేకుండానే 15 రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అయితే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం కోటి రూపాయలతో నిర్మించిన సెట్ కూలిపోవడం తో ఇక మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలవలేదు.

Pre-look poster of Pawan Kalyan's next with director Krish released | The News Minute

అయితే అన్ లాక్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో బిజీగా ఉండటం తో క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ తో కేవలం 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఒక సినిమా కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా మార్చ్ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అందుకు కారణం అనూహ్యంగా పవన్ కళయాణ్ క్రిష్ సినిమా కాకుండా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ కమిటవడమే. అయినా కూడా క్రిష్ .. పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేసి మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు తన సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయించుకున్నాడు.

అయితే క్రిష్ అదృష్ఠం కొద్ది అయ్యప్పనుం కోషియం కొన్ని కారణాల వల్ల డిలే అవడం తో పవన్ కళ్యాణ్ పిలిచి మరీ క్రిష్ కి దాదాపు 40 రోజుల కంటిన్యూ డేట్స్ ఇచ్చాడట. దాంతో ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఉన్న క్రిష్ వెంటనే పవన్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు జనవరి 4 నుంచి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. కాని కరోనా క్రిష్ కి మళ్ళీ షాకిచ్చింది. క్రిష్ కి కరోనా సోకడం తో ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాడు. 15 రోజుల పాటు బయటకి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. దాంతో డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎక్కడ జారిపోతాడో … అని క్రిష్ తెగ టెన్షన్ పడుతున్నాడట.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది