హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తారనే పేరున్న తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలోనే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారు. నెటిజన్లు కేటీఆర్ ను ఆటాడుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి… తప్పుడు ట్వీట్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారిన గిరిజన బాలిక దారుణ హత్యాచారం ఘటనకు సంబంధించిన విషయం కావడంతో విపక్షాలు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
వినాయక చవితి ముందు రోజు సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. ఆరేండ్ల చిన్నారిపై లైగింక దాడికి పాల్పడి దారుణంగా చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. అయితే చిన్నారి హత్యపై స్పందిస్తూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఘటన అత్యంత బాధాకరమంటూ ఈనెల 12న ట్వీట్ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు రచ్చ రచ్చవుతోంది.
ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఇంకా పోలీసులకు దొరకలేదు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఫలితం దక్కడం లేదు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులే ప్రకటించారు. అంతేకాదు నిందితుడిని పట్టిస్తే 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో కేటీఆర్ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితుడు ఎక్కడ మంత్రిగారూ? అతడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటూ నెటిజన్లు సోషల్మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన కేటీఆర్కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శిస్తున్నారు.
వ్యసనపరులకు తెలంగాణ స్వర్గథామంగా నిలించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా మంత్రి కేటీఆర్ ఐదు రోజుల క్రితమే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఐదు రోజుల తర్వాత నిందితుడు రాజు ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారని రేవంత్ ప్రస్తావించారు. కేటీఆర్ స్పృహలో ఉండే ఈ ట్వీట్ చేశారా అని ఆయన ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. నిందితుడి అరెస్టుపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా ట్వీట్ చేశానని విచారం వ్యక్తం చేశారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారని తెలిపారు. నిందితుణ్ని త్వరగా పట్టుకుని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అందరం కృషి చేద్దామని పేర్కొన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్… నెటిజన్లకు టార్గెట్ కావడం ఆసక్తిగా మారింది. అసలు పోలీసుల నుంచి సమాచారం లేకుండానే నిందితుడిని పట్టుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేయడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఈ అంశంలోనే కేటీఆర్ ను మరింత ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో కేటీఆర్ అనుచరులతో పాటు టీఆర్ఎస్ కేడర్ లో మాత్రం నిస్తేజం అలుముకుంది.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.