Categories: NewspoliticsTelangana

KTR: ఇదే లాస్ట్ హెచ్చరిక… వామ్మో… కేటీఆర్ ను ఇంత కోపంగా ఎప్పుడూ చూసి ఉండరు?

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ దాదాపుగా ఎక్కువగా సీరియస్ కారు. చాలా అరుదుగా ఆయన సీరియస్ అవుతుంటారు. కానీ… తాజాగా ఆయనకు వచ్చిన కోపాన్ని మాత్రం చూసి అందరూ షాక్ అయ్యారు. అవును… ప్రతిపక్ష పార్టీలను ఎప్పుడు విమర్శించినా.. కాస్త సరళంగానే కేటీఆర్ విమర్శిస్తారు. కానీ… ఈ సారి మాత్రం చాలా సీరియస్ గా కేటీఆర్ హెచ్చరించారు. అది కూడా ఇదే చివరి హెచ్చరిక అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. నిన్న వరంగల్ లో పర్యటించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు.

ktr speaks to media in warangal about govt jobs

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట సమీపంలోని రాంపూర్ లో రోజువారి తాగునీటి సరఫరాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే.. మరో 2 వేల కోట్ల మేర అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను హోదా, వయసు చూడకుండా.. ఇష్టమున్నట్టు దూషిస్తున్నారని… ఆయనపై ఇష్టమున్నట్టు విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం లాంటివి చేస్తే అస్సలు బాగుండదని… ఇదే చివరి హెచ్చరిక అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR : నిరుద్యోగ యువత తొందరపడొద్దు… త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం

బీజేపీ నేతలు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని… అసలు ప్రధాని మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు. ఆయన ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెడితే.. ఇప్పటి వరకు ఎన్ని సంస్థలను అమ్మేశారు అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగి సునీల్ ను రెచ్చిగొట్టి తప్పుదారి పట్టేలే చేసింది ఎవరు? యువతను ఎవ్వరూ గందరగోళానికి గురి చేయొద్. సునీల్.. ఐఏఎస్ కావాలనుకున్నాడు. ఐఏఎస్ నియామకాలను భర్తీ చేసేది రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా.. అవేమీ తెలియకుండా బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఏంటి? తెలంగాణ నిరుద్యోగులు, యువకులు అస్సలే తొందరపడొద్దు. క్షణికావేశానికి గురి కావద్దు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుంది.. అని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

త్వరలోనే మామూనూరు ఎయిర్ పోర్ట్ ను కూడా పునరుద్దరిస్తాం. కేంద్రం వరంగల్ కు చేసిందేమీ లేదు. చివరకు వరంగల్ కు మెట్రో రైలును తీసుకొచ్చేది కూడా మేమే. వరంగల్ నగర అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశామో శ్వేతపత్రం కూడా విడుదల చేస్తాం. దానికి రెట్టింపు డబ్బును కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తీసుకురాగలరా? అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

Recent Posts

Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…

51 minutes ago

Good News : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపున‌కి గ్రీన్ సిగ్న‌ల్..!

Good News : తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…

2 hours ago

Women : మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెల‌కి 50,000 సంపాద‌న

Women  : మ‌హిళ‌ల‌ని ప్రోత్స‌హించేందుకు మోదీ సర్కారు అనేక ప‌థ‌కాలు తీసుకొస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…

3 hours ago

Tea : ఉద‌యం, సాయంత్రం టీ అనగానే లొట్టలేసి తెగ తాగేవారికి… ఇది తెలిస్తే… ఆమడ దూరం పరిగెడతారు…?

Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…

4 hours ago

Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్ట‌డీగా సాగుతుంటాయి. ఆయ‌న సినిమాల్లో స్టార్ హీరోలు,…

4 hours ago

Watermelon : పుచ్చకాయల సీజన్ పోయిందిగా.. వీటితో ఏం పని అనుకునేరు… ఖాళీ కడుపుతో తింటే… ఏడాది తింటూనే ఉంటారు…?

Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…

6 hours ago

Yoga Asanas : యోగాసనాలతో వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి .. వీడియో వైర‌ల్‌..!

Yoga Asanas :  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌కు…

7 hours ago

Yogandhra 2025 : యోగాంధ్ర ద్వారా ఏపీ చ‌రిత్ర సృష్టించింది .. మోడీ

Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌…

8 hours ago