kvp ramachandra rao comments on YS Jagan
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం అటూ ఇటుగా ఉంది. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పాలన సాగుతోంది. వైసీపీ పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి.. కేవీపీ వైసీపీ ప్రభుత్వంపై కానీ.. సీఎం జగన్ పై కానీ ఏనాడూ విమర్శలు చేయలేదు. వైఎస్సార్ మరణించి చాలా ఏళ్లు అయినా ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఏఐసీసీ బాధ్యతలను కేవీపీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించిన విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా ఏపీ పాలనపై, వైసీపీ ప్రభుత్వంపై కేవీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలనను చూస్తుంటే తనకు ఆవేదన కలుగుతోందన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన పార్టీ పీసీసీ సమావేశంలో కేవీపీ పై వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చాలా భవిష్యత్తు ఉంది. కానీ ఏపీలో పాలన మాత్రం సరైన దిశలో సాగడం లేదు. అసలు విభజన హామీల కోసం కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పోరాటం లేదు. హామీల సాధన దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. పొలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఎటూ కాకుండా పోయింది. పోలవరం దుస్థితి చూస్తే నాకు చాలా బాధేస్తోంది.. అంటూ కేవీపీ వ్యాఖ్యానించారు.
kvp ramachandra rao comments on YS Jagan
నిజానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చూసుకోవాలని.. కానీ.. ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారని కేవీపీ అన్నారు. పోలవరం విషయంలోనూ ఏపీ ప్రభుత్వం తీరు ఏం బాగోలేదు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వ తీరు బాగోలేదన్నారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ప్రధాన లక్ష్యాలుగా కేవీపీ ఈసందర్భంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తోంది. చేస్తూ ఉంటుంది. 2024 కాకపోతే.. 2029 వరకు అయినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేవీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
This website uses cookies.