Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :26 August 2025,4:00 pm

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు, భక్తుల సందడి, దేవుడిపై చూపే భక్తి విరాజిల్లుతున్నాయి. అయితే, ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పామిడిలో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ విగ్రహ ప్రత్యేకతేంటంటే, పూర్తిగా సబ్బులు, షాంపూ ప్యాకెట్లతో రూపొందించడం.

#image_title

సాంప్రదాయ మట్టి విగ్రహాలకంటే భిన్నంగా, భక్తిని కాస్త సృజనాత్మకంగా చాటుకునే ప్రయత్నం చేశారు నిర్వాహకులు.విగ్రహ నిర్మాణంలో వినియోగించిన ప్రత్యేక వస్తువులు చూస్తే..

శరీరం: సంతూర్ సబ్బులు

చెవులు: లక్స్ సబ్బులు

కాళ్లు: సింతాల్ సబ్బులు

దంతాలు: మీరా షాంపూ ప్యాకెట్లు

హారాలు & అలంకరణ: సన్‌సిల్క్, కార్తీక షాంపూలు, కంఫర్ట్ ప్యాకెట్లు

ఈ వినూత్న గణపతి విగ్రహం తయారీకి సుమారు రూ. 25,000 ఖర్చయ్యిందని నిర్వాహకులు తెలిపారు. భక్తి మునిగిపోయే ఈ పండుగలో, ఇలా ప్రత్యేకంగా రూపొందించిన విగ్రహం పామిడిలో అందరి దృష్టిని సంతరించుకుంటోంది.స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సబ్బుల గణనాథుడిని దర్శించుకుంటూ, ఫోటోలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా పామిడిలో సబ్బులు, షాంపూలతో ఏర్పాటు చేసిన గణేశుడి ప్రతిమ అందరిని ఆకట్టుకుంటుంది.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి