
Making Of Tasty Crispy Prawns Curry In Telugu
Prawns Curry : మనం ఎక్కువగా చేపలు, చికెన్, మటన్, వండుకొని తింటూ ఉంటాం.. కానీ ఎంతో రుచికరమైన రొయ్యలు మాత్రం అప్పుడప్పుడు వండుకొని తింటుంటామ్. అయితే ఆ రొయ్యలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి. అటువంటి రొయ్యలు పులుసుని ఇప్పుడు ఇలా చేసి చూడండి. మళ్లీ మళ్లీ అదే విధంగా చేయమని అడుగుతారు. కావలసిన పదార్థాలు : రొయ్యలు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, కరివేపాకు, టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, పసుపు, ధనియాలపొడి, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలైనవి…
తయారీ విధానం : ముందుగా శుభ్రం చేసిన రొయ్యల్ని తీసుకొని మరొకసారి పసుపు, నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం, కొంచెం పసుపు, వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు 4 యాలకులు, కొంచెం జీలకర్ర ,లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, కొంచెం మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి.
Making Of Tasty Crispy Prawns Curry In Telugu
తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నా రొయ్యల్ని వేసి బాగా కలుపుకోవాలి . తర్వాత దానిలో టమాట ముక్కల్ని వేసి ఆయిల్ సపరేటు అయ్యేవరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, వేసి బాగా కలుపుకొని తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, వేసి కలుపుకొని తర్వాత చింతపండు రసాన్ని వేసి దగ్గరకయ్యే వరకు ఉడికించుకొని తర్వాత దానిలో ఒక టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసిన తరువాత ఇక గ్రేవీ దగ్గరకు అయ్యేవరకు ఉడికించుకొని స్టవ్ ఆపి దింపుకోవడం అంతే ఎంతో సింపుల్ గా రొయ్యల పులుసు రెడీ.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉపముఖ్యమంత్రి, జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు…
Anil Ravipudi Next Film : టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం…
Sri Malika : పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత…
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన…
Tea habit చలికాలం వచ్చిందంటే చాలు..ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ టీ కప్పు చేతిలో ఉండాల్సిందే అనిపిస్తుంది చాలామందికి.…
Gautham Ghattamaneni: టాలీవుడ్ ఎప్పటికప్పుడు మార్పులను స్వీకరిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తోంది. కొత్త హీరోలు, హీరోయిన్లు నిరంతరం వెండితెరపైకి వస్తున్నప్పటికీ…
Aadhaar Card New Rule: భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంక్…
This website uses cookies.