Chandrababu Naidu : అధికారంలో లేనప్పుడే బాబుకు వారు ఎందుకు గుర్తుకు వస్తున్నారు?

Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు మాత్రమే బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘాల వారు గుర్తుకు వస్తారని.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారిని అవమానించడం, వారిని పక్కకు పెట్టడం చేస్తారని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్, దువ్వూరి సుబ్బారావు, ఐ వై ఆర్ కృష్ణ రావు, ఎల్వీ సుబ్రమణ్యం లు ఇప్పుడు ఈనాడు రామోజీ రావు, చంద్రబాబు నాయుడు లకు బంధువులు అన్నట్లుగా మారి పోయారు. వారు ఏం మాట్లాడినా, వ్యాఖ్యలు చేసినా కూడా ఈనాడు లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

వారిని మేధావులు అన్నట్లుగా ఈనాడులో రాతలు ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు, రామోజీ రావుల సామాజిక వర్గం వారి యొక్క వ్యాఖ్యలను ఇప్పుడు ఎందుకు ముద్రించడం లేదు.. వారిని మేధావులుగా ఎందుకు పేర్కొనడం లేదంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి వాక్‌ స్వతంత్రం ఉంటుంది. కానీ ఈనాడు టిడిపికి మాత్రం రెండు మూడు రకాల వాక్‌ స్వతంత్రం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందులో ఒకటి అనని మాటలు అన్నట్లుగా చెప్పే వాక్‌ స్వతంత్రం, రెండవది తమకు అనుకూలంగా మాట్లాడితే వారి మాటలను పదింతలు చేసి చూపించే వాక్ స్వతంత్రం, మూడవది ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉంటే ఎవరైనా ఎదురు తిరిగితే వారిని విమర్శించడం, ఇష్టానుసారంగా ఆరోపణలు చేసే వాక్‌ స్వతంత్రం. ఇలా వారికే చెల్లింది.

malladi vishnu comments on chandrababu naidu and yellow media

గతంలో దువ్వూరి సుబ్బారావు ఇతర బ్రాహ్మణులను టిడిపి ఏ విధంగా అవమానపర్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. టిడిపి అధికారంలో లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఫ్రంట్ పేజీలో వేస్తారని, కృష్ణా రావు వ్యాఖ్యలు టిడిపి కి అనుకూలంగా ఉంటేనే ప్రచురిస్తారు అన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఏ స్థాయిలో అవమానాలు జరిగాయో ఈనాడు ఎల్లో మీడియాకు గుర్తు లేదా అంటూ ఆయన ప్రశ్నించాడు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అనేక రకాలుగా బ్రాహ్మణులకు మేలు చేస్తాం, బ్రాహ్మణులు మేధావులకు మద్దతు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ గతంలో తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు బ్రాహ్మణులను అవమాన పరిచినట్లు గా మాట్లాడారు అంటూ మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి ఒకవేళ మళ్ళీ తెలుగు దేశం పార్టీ వస్తే బ్రాహ్మణులను మళ్లీ విస్మరిస్తుందని.. అందుకే వారిని నమ్మొద్దు అంటూ మల్లాది విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Recent Posts

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

2 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

3 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

4 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

5 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

6 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

7 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

8 hours ago

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

17 hours ago