Chandrababu Naidu : అధికారంలో లేనప్పుడే బాబుకు వారు ఎందుకు గుర్తుకు వస్తున్నారు?

Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు మాత్రమే బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘాల వారు గుర్తుకు వస్తారని.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారిని అవమానించడం, వారిని పక్కకు పెట్టడం చేస్తారని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్, దువ్వూరి సుబ్బారావు, ఐ వై ఆర్ కృష్ణ రావు, ఎల్వీ సుబ్రమణ్యం లు ఇప్పుడు ఈనాడు రామోజీ రావు, చంద్రబాబు నాయుడు లకు బంధువులు అన్నట్లుగా మారి పోయారు. వారు ఏం మాట్లాడినా, వ్యాఖ్యలు చేసినా కూడా ఈనాడు లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

వారిని మేధావులు అన్నట్లుగా ఈనాడులో రాతలు ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు, రామోజీ రావుల సామాజిక వర్గం వారి యొక్క వ్యాఖ్యలను ఇప్పుడు ఎందుకు ముద్రించడం లేదు.. వారిని మేధావులుగా ఎందుకు పేర్కొనడం లేదంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి వాక్‌ స్వతంత్రం ఉంటుంది. కానీ ఈనాడు టిడిపికి మాత్రం రెండు మూడు రకాల వాక్‌ స్వతంత్రం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందులో ఒకటి అనని మాటలు అన్నట్లుగా చెప్పే వాక్‌ స్వతంత్రం, రెండవది తమకు అనుకూలంగా మాట్లాడితే వారి మాటలను పదింతలు చేసి చూపించే వాక్ స్వతంత్రం, మూడవది ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉంటే ఎవరైనా ఎదురు తిరిగితే వారిని విమర్శించడం, ఇష్టానుసారంగా ఆరోపణలు చేసే వాక్‌ స్వతంత్రం. ఇలా వారికే చెల్లింది.

malladi vishnu comments on chandrababu naidu and yellow media

గతంలో దువ్వూరి సుబ్బారావు ఇతర బ్రాహ్మణులను టిడిపి ఏ విధంగా అవమానపర్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. టిడిపి అధికారంలో లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఫ్రంట్ పేజీలో వేస్తారని, కృష్ణా రావు వ్యాఖ్యలు టిడిపి కి అనుకూలంగా ఉంటేనే ప్రచురిస్తారు అన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఏ స్థాయిలో అవమానాలు జరిగాయో ఈనాడు ఎల్లో మీడియాకు గుర్తు లేదా అంటూ ఆయన ప్రశ్నించాడు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అనేక రకాలుగా బ్రాహ్మణులకు మేలు చేస్తాం, బ్రాహ్మణులు మేధావులకు మద్దతు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ గతంలో తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు బ్రాహ్మణులను అవమాన పరిచినట్లు గా మాట్లాడారు అంటూ మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి ఒకవేళ మళ్ళీ తెలుగు దేశం పార్టీ వస్తే బ్రాహ్మణులను మళ్లీ విస్మరిస్తుందని.. అందుకే వారిని నమ్మొద్దు అంటూ మల్లాది విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Recent Posts

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

4 minutes ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

1 hour ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

2 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

3 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

4 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

5 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

6 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

7 hours ago