MLA KethiReddy : వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చంద్రబాబుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

MLA KethiReddy : ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాలంటీర్ల వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. లబ్ధిదారుల సమాచారాన్ని గోపికను ఎలా తీసుకుంటారు అని… అది తప్పు కదా అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇదే సమయంలో కోర్టు కొన్ని రిమార్క్స్.. బెంచ్ లో పాస్ చేస్తున్నట్లు పేపర్లలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైనా పని జరగాలంటే జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు సంతకం పెడితేనే పని అయ్యేది. అటువంటి కమిటీల వల్లే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చాలా నష్టపోయారు. ఆ తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ నీ నియమించడం జరిగింది.

MLA Kethi Reddy comments on Chandrababu regarding the volunteer system

ఆ తర్వాత రెండు వేల ఇళ్లకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్లు తమ పరిధిలో అర్హత కలిగిన వారిని సచివాలయంతో కనెక్ట్ చేసి… వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఫస్ట్ రెండు సంవత్సరాలు కోవిడ్ రావటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఒకరిని మరొకరు పాలికరించుకోలేని టైములో ఈ వాలంటీర్ వారి బాగోగులు చూసుకోవడం జరిగింది. ఆ సమయంలో వాలంటీర్ లేని చోట చాలామంది ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలు తన దృష్టికి కూడా వచ్చినట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. ఎక్కడ పక్షపాతం లేకుండా ప్రజలకు ప్రభుత్వాలు నుండి వచ్చే పథకాలు ఇంకా అనేక లాభాలను వీళ్ళు అందిస్తూ ఉన్నారు.

ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం కేవలం ప్రజల సమాచారాన్ని సచివాలయం వ్యవస్థకు అందిస్తున్నారు. ఆ తర్వాత పథకాలు అందిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ వాలంటీర్ వ్యవస్థను… తీసేయడానికి తెలుగుదేశం పార్టీ దొడ్డిదారులు వెతుకుతోంది. పోనీ తెలుగుదేశం పార్టీ వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఇలా దొంగగా పిల్ వేసుకుంటూ అడ్డుపడటం సమంజసం కాదని ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఖండించారు. ఈ క్రమంలో ప్రజలు గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి కమిటీల ద్వారా మేలు జరిగిందో లేకపోతే వాలంటీర్లు వ్యవస్థ వచ్చాక మేలు జరిగిందో వేర్ ఇస్ వేసుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి సూచించారు.

Recent Posts

Arattai app | వాట్సాప్‌కి పోటీగా వ‌చ్చిన ఇండియా యాప్.. స్వదేశీ యాప్‌పై జోహో ఫోకస్

Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్‌ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…

3 hours ago

RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు

RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…

4 hours ago

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

6 hours ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

8 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

10 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

12 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

13 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

14 hours ago