Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపధ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ని ఖరారు చేసారు అధికారులు. రేపు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో ప్రధాని పర్యటన ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకుంటారని ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిశాట్కు MI-17 హెలికాప్టర్లో బయల్దేరి, 2:35 గంటలకు చేరుకుంటారని అధికారులు వివరించారు.
మధ్యాహ్నం 2:45 గంటల నుంచి 4:15 వరకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారని వివరించారు. ఆ తర్వాత అదే కార్యక్రమంలో ఇక్రిశాట్ నూతన లోగోను మోడీ ఆవిష్కరిస్తారు అని అధికారులు వివరించారు.ఇక సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమానికి మోదీ వెళ్తారని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని అధికారులు పేర్కొన్నారు.
రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మోడీ పాల్గొంటారు అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 8:25 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ఇక హైదరాబాద్ లో మోడీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు అధికారులు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.