
#image_title
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా రాత్రి నాటికి ఇది కాకినాడ సమీపంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.తుఫాన్ సమీపిస్తున్న కొద్దీ వాతావరణం మరింత కఠినంగా మారనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
#image_title
గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు , గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం వరకు వీస్తాయని అంచనా. దీంతో నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు తీరప్రాంతాల్లో అలలు 4.7 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని IMD, INCOIS సంస్థలు హెచ్చరించాయి. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కాకినాడ, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
మొంథా తుఫాన్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
* రూమర్లు, అపోహలను నమ్మవద్దు; అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి.
* మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసుకుని ఉంచండి.
* వాతావరణ హెచ్చరికల SMS, రేడియో, టీవీ అప్డేట్స్ను గమనించండి.
* అత్యవసర వస్తువులు (ఔషధాలు, టార్చ్, తాగునీరు, డ్రై ఫుడ్, బ్యాటరీలు) సిద్ధంగా ఉంచండి.
* అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లండి.
* విలువైన పత్రాలు, వస్తువులను వాటర్ ప్రూఫ్ కవర్లలో ఉంచండి.
* ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి; గ్యాస్ కనెక్షన్లు, ఎలక్ట్రిక్ పరికరాలను తొలగించండి.
* పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దు.
* పశువులను విడిపించి సురక్షిత ప్రదేశాలకు తరలించండి.
* మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.