Raghu Rama Krishnam Raju : బీజేపీలోకి రఘురామ కృష్ణం రాజు – జగన్ కి ఇన్ డైరెక్ట్ గా దెబ్బ కొట్టబోతున్నాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raghu Rama Krishnam Raju : బీజేపీలోకి రఘురామ కృష్ణం రాజు – జగన్ కి ఇన్ డైరెక్ట్ గా దెబ్బ కొట్టబోతున్నాడు?

 Authored By kranthi | The Telugu News | Updated on :2 July 2023,9:00 am

Raghu Rama Krishnam Raju : ఏపీ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఏపీలో ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో జరుగుతాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఏపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో అక్కడ పాగా వేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెగ ఆరాటపడుతోంది. అందులో భాగంగానే.. బీజేపీ కొత్త సమీకరణలను తీసుకొస్తోంది. ఏపీలో అధికార పార్టీని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ నేతలను తమ పార్టీలోకి లాక్కోవాలి.

దాని కోసం.. బీజేపీ రకరకాల ప్లాన్స్ వేస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. అందుకే ఏపీ బీజేపీలో పలు మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Raghu Rama Krishnam Raju : రఘురామను బీజేపీ అధ్యక్షుడిగా చేస్తారా?

వైసీపీలో రెబల్ గా మారిన రఘురామ చాలా రోజుల నుంచి బీజేపీకి మద్దతుగానే మాట్లాడుతున్నారు. ఢిల్లీలో బీజేపీకి మద్దతు ఇస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈనేపథ్యంలోనే బీజేపీలోకి రఘురామకృష్ణంరాజు చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. రఘురామకు ఏ పొజిషన్ ఇస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ బీజేపీకి ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆ పదవి.. రఘురామకు ఇస్తారా అనేదానిపై కూడా క్లారిటీ లేదు. కానీ.. బీజేపీ ఏపీ అధ్యక్షులుగా ప్రస్తుతం రేసులో చాలామందే ఉన్నారు. అందులో దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్ యాదవ్ లాంటి వాళ్లు ఉన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది