Red Book : రెడ్ బుక్ క్లోజ్ కాలేదు..దాని పని అది చేస్తుంది – లోకేష్
Nara Lokesh on Red Book : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘రెడ్ బుక్’ మరోసారి చర్చనీయాంశమైంది. మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావించిన రెడ్ బుక్ను తాను మరిచిపోలేదని లోకేశ్ స్పష్టం చేశారు. “ఎవరి పని వారు చేసుకోవాలి. రెడ్ బుక్ దాని పని అది చేస్తుంది” అని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక విషయాలు తనకు గుర్తున్నాయని, వాటిని త్వరలో బయటపెట్టనున్నట్లు పరోక్షంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Nara Lokesh Red Book
మరోవైపు లోకేశ్ విద్యా రంగంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. విద్యారంగంలో రాజకీయ జోక్యం ఉండకూడదని, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, కడపలో ఆహార తరలింపు వాహనాలపై కూడా ఆయన దృష్టి సారించారు. నిన్న కడపలో పసుపు రంగులో ఉన్న ఆహార తరలింపు వాహనాలను చూసి, వాటి రంగు మార్చాలని కలెక్టర్ను ఆదేశించారు. విద్యాశాఖ కలర్ కోడ్ ప్రకారం గ్రీన్, బ్రౌన్, రెడ్ రంగులు మాత్రమే వాడాలని ఆయన స్పష్టం చేశారు.
లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆదేశాలు ప్రభుత్వ విధానాలను స్పష్టం చేస్తున్నాయి. రెడ్ బుక్ ప్రస్తావనతో ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారని, అదే సమయంలో పాలనలో కొత్త విధానాలను అమలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో రంగుల రాజకీయాలకు తావు లేకుండా చేయాలని ఆయన చేసిన ప్రయత్నంపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. భవిష్యత్లో రెడ్ బుక్కు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.