
telangana cm kcr to meet modi over liquor scam case
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విషయంలోనూ కేంద్రంతో కాలుదువ్వుతున్నాడు. కేంద్రం ఒక్కటంటే.. కేసీఆర్ రెండంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేస్తున్న తప్పులను ప్రజల ముందు పెట్టాలని కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారు. ప్రెస్ మీట్లు,సభల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారు. కానీ ఆయన మాటలు నమ్మేందుకు జనం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. కారణం గత రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడమే. ఇటీవల కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా చండూరు, నిన్న పెద్దపల్లిలో భారీ సభ నిర్వహించి కేంద్రాన్ని విమర్శించారు.జాతీయ రాజకీయాల్లోకి పోవాలా? వద్దా? అని ప్రజలను కోరారు.
కేసీఆర్ ప్రతి మూమెంట్ను గమనిస్తున్న కేంద్రం.. ఆయన్ను ఎలా కట్టడి చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోవడం లేదని తెలుస్తోంది.మొన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రకటించడం.. ఫినిక్స్, వాసవి కంపెనీలపై ఈడీ దాడులు.. తాజాగా ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఒక నెలలోపు చెల్లించాలని అల్టిమేటం జారీ చేసింది.దీంతో కేసీఆర్ను ఇరకాటంలో పెట్టాలని కేంద్రం భావించినట్టు సమాచారం. 2014 నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. రూ. 3,441కోట్లుకు సర్ చార్జీలు కలిపి రూ. 3,315 కోట్లు అనగా.. మెత్తంగా రూ.6,766 కోట్లను చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
Narendra Modi sarkars deadline for telangana will KCR reduce will he stay
గతంలో చంద్రబాబు హయాం నుంచి నేడు సీఎం జగన్ ఈ బకాయిల విషయంలో కేంద్రానికి పలుమార్లు విన్నవించుకున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో జగన్ ఈ ప్రస్తావన తేవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలు ఒకనెలలో చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది నిజంగానే కేసీఆర్కు గట్టి దెబ్బనే చెప్పవచ్చును. అయితే, ఈ విషయంలో కేసీఆర్ కేంద్రానికి తలొగ్గుతారా? లేదా తన పంతం నెగ్గించుకోవడానికి కోర్టుకు వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ మళ్లీ కేంద్రానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళితే.. మోడీ సర్కార్ ఈ సారి ఎటువంటి పాయింట్ ఎత్తుకుని కేసీఆర్ సర్కార్కు స్కెచ్ గీస్తుందో తెలియాల్సి ఉంది.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.