Railway Passenger : ఆహారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం.. రైల్వే ప్ర‌యాణికుడికి 35 వేల చెల్లింపు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Railway Passenger : ఆహారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం.. రైల్వే ప్ర‌యాణికుడికి 35 వేల చెల్లింపు

Railway Passenger : ఓ రైల్వే ప్రయాణికుడికి ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వినియోగాదారుల కమిషన్‌ సదరు బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్‌రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్నాడు. ఇండియన్‌ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్, ఆంధ్రా స్పైసీ కిచెన్‌ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో బుక్‌చేసి రూ.263 చెల్లించాడు. కాని వారు రామ్మోహన్‌రావుకు ఆహారాన్ని అందించలేదు. రైలు కదిలిన తర్వాత ఆహారం […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 August 2024,6:00 pm

Railway Passenger : ఓ రైల్వే ప్రయాణికుడికి ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వినియోగాదారుల కమిషన్‌ సదరు బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్‌రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్నాడు.

ఇండియన్‌ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్, ఆంధ్రా స్పైసీ కిచెన్‌ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో బుక్‌చేసి రూ.263 చెల్లించాడు. కాని వారు రామ్మోహన్‌రావుకు ఆహారాన్ని అందించలేదు. రైలు కదిలిన తర్వాత ఆహారం పంపిణీ చేసినట్లు మెసేజ్‌ పంపించారు.

Railway Passenger ఆహారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం రైల్వే ప్ర‌యాణికుడికి 35 వేల చెల్లింపు

Railway Passenger : ఆహారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం.. రైల్వే ప్ర‌యాణికుడికి 35 వేల చెల్లింపు

దాంతో బాధితుడు అన్ని ఆధారాల‌తో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. విచారణ అనంతరం బాధితుడికి నష్ట పరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ మంగ‌ళ‌వారం తీర్పును వెలువ‌రించింది. సకాలంలో చెల్లించకపోతే నష్ట పరిహారానికి 12 శాతం వడ్డీ కట్టాలని ఆదేశించింది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది