
Train Ticket Booking : రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు.. తెలుసుకోకపోతే మీకే బొక్క
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో టికెట్ బుకింగ్ మరియు రీఫండ్ నిబంధనలను సమూలంగా మార్చేసింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, రైల్వే ఆదాయ నష్టాన్ని నివారించే లక్ష్యంతో ఈ కొత్త మార్పులను ప్రవేశపెట్టింది.
Train Ticket Booking : రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు.. తెలుసుకోకపోతే మీకే బొక్క
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ఆర్ఏసీ (RAC) రద్దు: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇకపై స్లీపర్ క్లాస్లో ఆర్ఏసీ (Reservation Against Cancellation) టిక్కెట్లు ఉండవు. సాధారణంగా టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఒకే బెర్త్ను ఇద్దరికి కేటాయించే ఆర్ఏసీ విధానాన్ని ఈ రైళ్లలో నిలిపివేశారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయాణం ప్రారంభం నుంచే కన్ఫర్మ్డ్ బెర్తులు లభిస్తాయి. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) మొదలైనప్పటి నుంచే అన్ని బెర్త్లు కన్ఫర్మ్ స్టేటస్తోనే జారీ చేయబడతాయి. అయితే, మహిళలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు ఉండే ప్రత్యేక కోటాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.
ప్రీమియం రైళ్లలో టికెట్ రద్దు చేసుకునే వారిపై రైల్వే బోర్డు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు కన్ఫర్మ్డ్ టికెట్ను రద్దు చేసుకుంటే, ప్రయాణికులకు పైసా కూడా రీఫండ్ లభించదు (Zero Refund). ఒకవేళ 72 గంటల కంటే ముందు రద్దు చేస్తే 25 శాతం, 72 నుండి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం ఛార్జీని కోత విధిస్తారు. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు పాక్షిక రీఫండ్ పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును ఈ ప్రీమియం రైళ్లకు తొలగించారు.
చివరి నిమిషంలో టికెట్లు రద్దు కావడం వల్ల బెర్తులు ఖాళీగా ఉండిపోయి, రైల్వేలకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోంది. కన్ఫర్మ్ అయిన సీట్లు వృథా కాకుండా ఉండటానికే ఈ ‘ప్రీమియం క్యాన్సిలేషన్’ పాలసీని తెచ్చినట్లు అధికారులు వివరిస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే ఖరారు చేసుకోవాలని, అనిశ్చితి ఉంటే సాధ్యమైనంత త్వరగా టికెట్లు రద్దు చేసుకోవాలని రైల్వే సూచిస్తోంది. ఈ మార్పుల వల్ల నిజమైన ప్రయాణికులకు కన్ఫర్మ్డ్ సీట్లు దొరికే అవకాశం పెరుగుతుందని, అదే సమయంలో అనవసరమైన రద్దులు తగ్గుతాయని రైల్వే ఆశిస్తోంది.
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
This website uses cookies.