ntr and ys rajasekhar reddy politics in telangana
telangana సినిమా లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో ఏర్పాటు అయిన పార్టీ తెలుగు దేశం పార్టీ. అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలుగు వారికి కనీస ఆత్మగౌరవం ఉందని గుర్తించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పార్టీని ఏర్పాట్లు చేశాడు. పార్టీ అవసరం చాలా ఉన్న సమయంలో తెలుగు దేశం పార్టీ వచ్చింది. రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ మళ్లీ మళ్లీ అధికారంలో కూర్చుంది. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లో లేదా మరేంటో కాని తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చింది. చంద్రబాబు కూడా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వెళ్లాడు.
చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్రం విడిపోవడానికి ఇష్టపడలేదు. సాధ్యం అయినంతగా వారు తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ప్రయత్నించారు. కాని రాజశేఖర్ రెడ్డి మృతి చెందడం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామల కారణంగా రాష్ట్రం విడిపోక తప్పలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు దేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంటుందని అంతా అనుకున్నారు.
ntr and ys rajasekhar reddy politics in telangana
కాంగ్రెస్ కు ఏపీలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. వైకాపా ను తెలంగాణలో బలపర్చాలనే ఉద్దేశ్యం ను పక్కన పెట్టిన జగన్ తన సోదరిని రంగంలోకి దించి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విధంగా చేయడంలో విఫలం అయ్యాడు.
టీడీపీ అంటేనే ఆత్మ గౌరవం కోసం ఏర్పడిన పార్టీ. తెలుగు వారు telangana తెలంగాణలో కూడా ఉన్నారు కనుక ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా పార్టీని బలపర్చాల్సిన అవసరం ఉంది. కాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో పార్టీని పూర్తిగా వదిలేశాడు. ఆమద్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొన్నటి ఉప ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ కనిపించలేదు. పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రచారం చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా టీడీపీకి బలం చేకూరే అవకాశం ఉంది. కాని ఆయన మాత్రం తెలంగాణతో సంబంధం లేదు అన్నట్లుగా ఏపీకే పరిమితం అయ్యాడు. టీడీపీ కేవలం ఏపీ వారి ఆత్మగౌరవం కాపాడే పనిలో పండింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.