
NTR Family members are dieing in August Month
NTR Family : కొందరికి కొన్ని రకాల గండాలు ఉంటాయి. ఆ గండాలు గట్టెక్కేందుకు పూజలు చేయడం, లేదంటే దోష నివారణకు వేరే మార్గాలు ఎంచుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఫ్యామిలీకి ఆగస్ట్ గండం ఉంది. ఆయన ఫ్యామిలీలో చాలా మంది ఆగస్ట్లోనే చనిపోయారు. తాజాగా ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి కూడా ఆగస్ట్లో చనిపోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. మరి ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరెవరు ఆగస్ట్లో చనిపోయారు, ఆ సంగతులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. టీడీపీ వ్యవస్థాపకులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే నందమూరి హరికృష్ణ ఆయన కుమారుడు జానకీరామ్ ఆకస్మిక మరణాలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వారి మరణాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఉమామహేశ్వరి ఆత్మహత్య వారిని శోకసంద్రంలో ముంచింది.
రాజకీయా పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాడు ఎన్టీఆర్. అప్పటి వరకు రాష్ట్రాల్లో పెత్తనం చేస్తున్న జాతీయ పార్టీల హవాకు గండికొట్టి రీజినల్ పార్టీలను తెర మీదకు తీసుకువచ్చారు. తెలుగు జాతి ఉన్నంతకాలం నిలిచివుండే అతికొద్దిమంది వ్యక్తుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ సంతానం ఎంతమంది అన్న విషయం ఈ జనరేషన్లో తెలిసింది ఎంత అంటే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎన్టీఆర్కు 12 మంది సంతానం. వీరిలో 8 మంది కుమారులు కాగా… నలుగురు కూతుళ్లు. వీరిలో కుమారులు నందమూరి రామకృష్ణ సీనియర్ , నందమూరి జయకృష్ణ, నందమూరి సాయికృష్ణ, నందమూరి హరికృష్ణ, నందమూరి మోహనకృష్ణ, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ జూనియర్, నందమూరి జయశంకర్ కృష్ణ కాగా.. కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి.
NTR Family members are dieing in August Month
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించారు. మరో కుమారుడు నందమూరి సాయికృష్ణ కూడా అనారోగ్యంతో 2004లో కన్నుమూశారు. ఇక అన్నగారికి ఎంతో ఇష్టమైన మరో కుమారుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్ట్లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడైన నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్ 6న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమైంది.
ఎన్టీఆర్ కుటుంబంలో బయటి ప్రపంచానికి తెలిసినవారు కొందరే. వీరిలో ఉమామహేశ్వరి కూడా ఒకరు. కుటుంబ వేడుకలు, ఫంక్షన్లలో మాత్రమే ఆమె కనిపించేవారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీలో తన సోదరి నారా భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడటంతో దీనిని ఖండించేందుకు మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ ఏడాది మొదట్లో చిన్న కుమార్తె దీక్షిత వివాహాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఉమామహేశ్వరి. దాదాపు పాతికేళ్ల తర్వాత నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు కలుసుకుంది ఈ పెళ్లిలోనే. ప్రస్తుతం అంతా సంతోషంగా వున్న సమయంలో ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. అసలు వీరు ఆగస్ట్లోనే ఎందుకు ఇలా కన్నుమూస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కంఠమనేని ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకి పాల్పడిందని ఆమె కూతురు దీక్షిత మీడియాతో వెల్లడిచారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర స్థాయిలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోందని, మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తుంది. ఉమామహేశ్వరిని మొదట ఎన్టీఆర్.. నరేంద్ర రాజన్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడట. అనుకోని సంఘటనల ద్వారా విడిపోయారు. ఆమె జీవితంలో ఇది విషాదకర సంఘటన. ఆ తర్వత ఆమెకి కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్తో రెండో వివాహం జరిగింది.
Farmers : తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక చర్యలు చేపడుతోంది.…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న చర్చలు చూస్తుంటే సామాన్యులకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా శాసనమండలి…
Gold and Silver Rate Today 8 March 2026 : గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చి,…
Raw Onions : వేసవికాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు,…
Spinach : వేసవి కాలం మొదలైతే ఎండలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శరీరాన్ని అలసటకు గురిచేయడమే కాకుండా…
zodiac signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాల కలయికలు…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
This website uses cookies.