NTR : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ఒక భారీ యాక్షన్ ఎంటైనర్ రూపొందనుందని గత ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత వాస్తవంగా మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇదే అని గత ఏడాది మొత్తం ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ ప్రాకెల్ట్ ఉన్నట్టు అటు ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరు కన్ఫర్మేషన్ ఇచ్చారు. కాని మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతలు మాత్రం మైత్రీ వారు అన్న మాట బలంగా వినిపించింది. ఈ ఇద్దరి తో ప్రాజెక్ట్ అంటే నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ తప్ప వేరే వాళ్ళ పేరు వినిపించలేదు.
కాగా ఈ విషయాన్ని తాజాగా మైత్రీ వారు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసందే. ఇప్పటికే ఈ సినిమా 10 రోజుల షెడ్యూల్ కూడా ఫినిస్ చేశాడు ప్రశాంత్ నీల్. త్వరలో భారీ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవబోతోంది. కాగా ఈ సినిమా ని 4 నుంచి 5 నెలల్లో కంప్లీట్ చేయబోతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే సలార్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. కాగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామా ని తెరకెక్కించబోతున్నాడు.
2022 ప్రథమార్థంలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చ్ చివరికి కంప్లీట్ అవబోతోందట. ఆ తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మొదలవనుంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.