నారా లోకేశ్ కు పోటీగా పరిటాల శ్రీరామ్.. ఒకే ఒక్క ప్రసంగంతో ఏపీలో హీరో అయిపోయాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

నారా లోకేశ్ కు పోటీగా పరిటాల శ్రీరామ్.. ఒకే ఒక్క ప్రసంగంతో ఏపీలో హీరో అయిపోయాడు?

రాజకీయాల్లో రాణించాలంటే ముందు కావాల్సింది మాటకారితనం. అవును.. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే.. ప్రజలను మైమరిపించేలా మాట్లాడాలి. వాళ్ల ప్రజలకు సమాధానం చెప్పేలా ఉండాలి. ఇతర రాజకీయ నాయకులు వేలెత్తి చూపించకుండా.. వాళ్లకు గట్టి సమాధానం చెప్పేంత రేంజ్ ఉండాలి. లేకపోతే.. రాజకీయాల్లో రాణించడం కష్టం. తొక్కేస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నేతల వారసులు చాలామంది రాజకీయాల్లో రాణించలేకపోవడానికి ప్రధాన కారణం అదే. మాటకారులు కాకపోవడమే. ఎంత టాలెంట్ ఉన్నా.. నలుగురిని మెప్పించేలా మాట్లాడకపోతే వేస్ట్. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 December 2020,6:31 pm

రాజకీయాల్లో రాణించాలంటే ముందు కావాల్సింది మాటకారితనం. అవును.. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే.. ప్రజలను మైమరిపించేలా మాట్లాడాలి. వాళ్ల ప్రజలకు సమాధానం చెప్పేలా ఉండాలి. ఇతర రాజకీయ నాయకులు వేలెత్తి చూపించకుండా.. వాళ్లకు గట్టి సమాధానం చెప్పేంత రేంజ్ ఉండాలి. లేకపోతే.. రాజకీయాల్లో రాణించడం కష్టం. తొక్కేస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నేతల వారసులు చాలామంది రాజకీయాల్లో రాణించలేకపోవడానికి ప్రధాన కారణం అదే. మాటకారులు కాకపోవడమే. ఎంత టాలెంట్ ఉన్నా.. నలుగురిని మెప్పించేలా మాట్లాడకపోతే వేస్ట్.

రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. నలుగురిలో మాట్లాడలేక తడబాటు పడుతారు టీడీపీ నేత నారా లోకేశ్. ఆయన చాలాసార్లు మాట్లాడుతూ తడబడ్డారు. జనాల ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఎన్నోసార్లు ఆయన ప్రసంగంలో తప్పులు దొర్లాయి. నారా లోకేశ్ ను నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు చేయని పని లేదు. ఎంతో ట్రెయినింగ్ ఇప్పించినప్పటికీ.. నారా లోకేశ్ కు మాత్రం రాజకీయ పరిణతి రావడం లేదు.. అనే వార్తలూ వినిపిస్తున్నాయి.

లోకేశ్ ను మించిన శ్రీరామ్?

ఈనేపథ్యంలో టీడీపీ పార్టీకే చెందిన మరో యువ నేత పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆయన పరిటాల రవి కొడుకు. రవి తర్వాత శ్రీరామే వాళ్ల రాజకీయ వారసుడు. ఇప్పటికే తన తల్లి పరిటాల సునీత.. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో శ్రీరామ్.. టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ.. ఓడిపోయాడు. అప్పటి నుంచి పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ.. తాజాగా సాగునీటి వసతి కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొనాల్సి వచ్చింది. ఈసందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓడిపోయాక.. ఇప్పటి వరకు బయటికి రాని శ్రీరామ్.. ఇప్పుడు బయటకు వచ్చి అద్భుతంగా ప్రసంగించడంతో.. యువ రాజకీయ నాయకుడయిన లోకేశ్ కు శ్రీరామ్ పోటీ వస్తున్నాడు.. అంటూ టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. చూద్దాం మరి.. పరిటాల శ్రీరామ్ టీడీపీలో హైలెట్ అవుతాడా? అవ్వడా? అని

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది