Janasena : నాదెండ్లకు జనసేనలో ప్రాధాన్యం తగ్గిందా? పవన్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

Janasena : నాదెండ్ల మనోహర్… జనసేన పార్టీలో కీలక నేత. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో అంతటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి నాదెండ్ల అని చెప్పుకోవచ్చు. అయితే… నాదెండ్ల మనోహర్ పార్టీలో ఉండటం… కొందరు పవన్ అభిమానులకు నచ్చడం లేదు. అది ఇప్పటి గొడవ కాదులే… పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నదే. అయితే… పవన్ ఇదివరకు నాదెండ్ల ఏది చెబితే దానికి తల ఊపేవారు అనే వార్త కూడా ప్రచారంలో ఉండేది.

pawan kalyan big shock to nadendla manohar

నాదెండ్లకు పవన్ ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం కూడా కొందరు ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి గిట్టేది కాదు. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. పవన్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సొంతంగా తీసుకుంటున్నారట. తన సొంత నిర్ణయం మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారట. అసలు.. జనసేన నేతల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా.. పవన్ కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నారనే విమర్శలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి.

కొన్ని విషయాల్లో చాలామంది నేతలు పవన్ మాటను జవదాటరు. తూచా తప్పకుండా ఆయన మాటను వింటారు. కానీ.. పవన్ మాత్రం జనసేన నేతల మాటలకే విలువివ్వడం లేదట. పార్టీలో కొన్ని కీలక పదవుల విషయంలోనూ, నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించే విషయంలోనూ పవన్ కొన్ని తప్పులు చేస్తున్నారంటూ పార్టీలో ఎక్కువగా చర్చ నడుస్తోంది.

మరోవైపు చాలామంది పార్టీలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. పవన్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది.నాదెండ్ల మనోహర్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా తొందరపడ్డారని… నాదెండ్ల పార్టీలోకి వచ్చాక జనసేనలో సమస్యలు ఎక్కువయ్యాయని… అయినప్పటికీ పవన్ కళ్యాణ్… నాదెండ్ల విషయంలో చూసీ చూడనట్టు వదిలేయడంతో అవి ఇంకాస్త ఎక్కువయ్యాయనే భావన కూడా ఉంది.

Janasena : గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నాదెండ్లను ప్రకటించే అవకాశం

అందుకే పవన్ కళ్యాణ్… నాదెండ్ల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నాదెండ్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. నాదెండ్ల మనోహర్ ప్రాధాన్యతను పార్టీలో తగ్గించడం కోసం పవన్ కళ్యాణ్ ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే… పార్టీలో ఆయన జోక్యాన్ని తగ్గించడం కోసం, కొన్ని నిర్ణయాలను తనే తీసుకొని… వాటిని త్వరలోనే ప్రకటించనున్నారట. అందుకే గుంటూరుతో పాటు తెనాలి నియోజకవర్గానికి అభ్యర్థిని కూడా ముందే ప్రకటిస్తారట పవన్. అలాగే… ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జీలను నియమించే విషయంపై కూడా ఓ కీలక నిర్ణయం తీసుకొని పవన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Share

Recent Posts

Chandrababu : మహానాడు వేదికపై రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…

4 hours ago

Chandrababu Naidu : మహానాడు వేదికపై మహిళలకు శుభవార్త తెలిపిన చంద్రబాబు

Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…

5 hours ago

TDP Mahanadu : మహానాడు వేదిక పై పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…

6 hours ago

Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న‌ పోస్ట్..!

Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…

7 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..!

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌డంపై…

8 hours ago

Kavitha Revanth Reddy : కాంగ్రెస్‌తో క‌విత రాయ‌బారం మొద‌లు పెట్టిందా.. రేవంత్ ఏమ‌న్నాడంటే..!

Kavitha Revanth Reddy : కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన క‌విత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం…

9 hours ago

Tax Payers : ట్యాక్స్ పేయ‌ర్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌కేంద్రం

Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప‌న్ను రిట‌ర్న్ విష‌యంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్…

10 hours ago

Pushpa Movie Shekhawat : పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు.. కాని ఏమైందంటే..!

Pushpa Movie Shekhawat  : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ వైవిధ్య‌మైన సినిమాల‌తో…

11 hours ago