
Telangana : మనం ఆధునిక సమాజ స్థాపన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కానీ, ఎక్కడో ఒక చోట రాతికాలం యొక్క స్వభావాన్ని మనిషి ప్రదర్శిస్తూనే ఉన్నాడు.. మన దేశంలో జరుగుతున్నా కొన్ని సంఘటనలు చూస్తే , ఇంకా మనం ఏ కాలంలో బ్రతుకుతున్నామో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో జరిగిన ఒక సంఘటన గురించి వింటే మనిషన్నవాడు ఇలాంటి పనులు కూడా చేస్తారా అనిపిస్తుంది.
మహాబుబాబాద్ జిల్లా థోర్రూర్కు చెందిన పది పన్నెడు ఏళ్ల ఉండే ఇద్దరు కుర్రాళ్లు ఒక పొలంలో మామిడి పళ్లు దొంగతనం చేశారు . ఆ సమయంలో వాళ్ళను పట్టుకున్న ఆ పొలం యజమానులు ఆ ఇద్దరినీ కట్టేసి కర్రలతో గొడ్డును బాదినట్లు కొట్టటమే కాకుండా దారుణంగా ఆవు పేడను బలవంతంగా వాళ్ళతో తినిపించే ప్రయత్నం చేస్తూ నోట్లో కుక్కటం జరిగింది..
ఇలాంటి నీచమైన పనులు చేయటమే కాకుండా దానిని వీడియో తీసి శునకానందం పొందారు.. దీనితో ఆ వీడియో ఒకరి నుండి ఒకరికి షేర్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యావత్తు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, అలాంటి దారుణమైన సంఘటన చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ ఆ సంఘటనపై విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది..
నిజానికి ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల జరుగుతాయని మనం చూస్తూనే ఉన్నాం, ప్రేమించారని మూత్రం తాగించటం,, భర్త మాట వినలేదని బట్టలు విప్పి రోడ్డు మీద ఆడవాళ్లను పరిగెత్తించటం, లాంటి అమానుష సంఘటనలు ఎన్నో చూశాం . ఇప్పుడు తెలంగాణ లో జరిగిన దుశ్చర్య కూడా వాటికీ ఏమి తక్కువ కాదు.. దీనిపై పోలీసులు విచారణ జరిగి, ఆయా నిందుతులపై కఠిన చర్యలు తీసుకోని అలాంటి నీచమైన పనులు చేయాలి అనుకునేవాళ్ళకి కనువిప్పు కలిగించాలి
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.