Telangana : మనం ఆధునిక సమాజ స్థాపన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కానీ, ఎక్కడో ఒక చోట రాతికాలం యొక్క స్వభావాన్ని మనిషి ప్రదర్శిస్తూనే ఉన్నాడు.. మన దేశంలో జరుగుతున్నా కొన్ని సంఘటనలు చూస్తే , ఇంకా మనం ఏ కాలంలో బ్రతుకుతున్నామో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో జరిగిన ఒక సంఘటన గురించి వింటే మనిషన్నవాడు ఇలాంటి పనులు కూడా చేస్తారా అనిపిస్తుంది.
మహాబుబాబాద్ జిల్లా థోర్రూర్కు చెందిన పది పన్నెడు ఏళ్ల ఉండే ఇద్దరు కుర్రాళ్లు ఒక పొలంలో మామిడి పళ్లు దొంగతనం చేశారు . ఆ సమయంలో వాళ్ళను పట్టుకున్న ఆ పొలం యజమానులు ఆ ఇద్దరినీ కట్టేసి కర్రలతో గొడ్డును బాదినట్లు కొట్టటమే కాకుండా దారుణంగా ఆవు పేడను బలవంతంగా వాళ్ళతో తినిపించే ప్రయత్నం చేస్తూ నోట్లో కుక్కటం జరిగింది..
ఇలాంటి నీచమైన పనులు చేయటమే కాకుండా దానిని వీడియో తీసి శునకానందం పొందారు.. దీనితో ఆ వీడియో ఒకరి నుండి ఒకరికి షేర్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యావత్తు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, అలాంటి దారుణమైన సంఘటన చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ ఆ సంఘటనపై విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది..
నిజానికి ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల జరుగుతాయని మనం చూస్తూనే ఉన్నాం, ప్రేమించారని మూత్రం తాగించటం,, భర్త మాట వినలేదని బట్టలు విప్పి రోడ్డు మీద ఆడవాళ్లను పరిగెత్తించటం, లాంటి అమానుష సంఘటనలు ఎన్నో చూశాం . ఇప్పుడు తెలంగాణ లో జరిగిన దుశ్చర్య కూడా వాటికీ ఏమి తక్కువ కాదు.. దీనిపై పోలీసులు విచారణ జరిగి, ఆయా నిందుతులపై కఠిన చర్యలు తీసుకోని అలాంటి నీచమైన పనులు చేయాలి అనుకునేవాళ్ళకి కనువిప్పు కలిగించాలి
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.