PM Kisan Yojana : కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి ప్రోత్సాహం నిమిత్తం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సాయం ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాదితో ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 11 విడతల వారీగా నిధులు జమ చేసింది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే అప్డేట్ చేసుకున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇక ఈ కేవైసీ అప్డేట్ ఇంకా చేసుకోని రైతుల కోసం జులై 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ నిధులు పొందడానికి అర్హులు కానట్లే. అయితే ఈ పథకాన్ని అనర్హులు కూడా వినియోగించుకుటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా నగదు పొందుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. ఇక వారికి నోటీసులు కూడా పంపుతున్నట్లు చెబుతోంది. అయితే ముందుగానే పీఎం కిసాన్ నగదును రిటర్న్ చేయాలనుకునే వారు ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్కు వెళ్లాలి. రిఫండ్ ఆన్లైన్ ఆనే ఆప్షన్ ఎంచుకుని మనీ రిఫండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ తర్వాత ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఇక గెట్ డేటాపై క్లిక్ చేస్తే రిఫండ్ అమౌంట్కు ఎలిజిబిలిటీ లేదు అనే ఆప్షన్ కనిపిస్తే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. రీఫండ్ అమౌంట్ కనిపిస్తే డబ్బులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీళ్లు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అనర్హులుగా ప్రకటించింది. డాక్టర్లు, ఇంజినీర్లు, సీఏ, లాయర్లు, ఆర్కిటెక్స్ వంటి వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందటానికి అనర్హులు. అలాగే రాజ్యంగబద్ధమైన పదవి కలిగిన వారు కూడా ఈ స్కీమ్కు అనర్హులు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తించదు. అలాగే నెలకు రూ.10 వేలకు పైగా పెన్షన్ పొందే వారు కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందలేరు. మాజీ మంత్రులు, మేయర్లు, లోక్ సభ రాజ్యసభ సభ్యులు, డిస్ట్రిక్ పంచాయితీ ప్రెసిడెంట్, ఎమ్మేల్యే, ఎంఎల్సీ వంటి వారు కూడా పీఎం కిసాన్ బెనిఫిట్ పొందలేరు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుకు కూడా ఈ పథకం వర్తించదు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం చాలా ప్రత్యేకమైనది. అయితే శని దేవుడు క్రమశిక్షణకు మారుపేరు. శని…
Amla Juice : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాం. అలాగే శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే…
TGSRTC : రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థను విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పల్లె వెలుగు…
Banana : మనం ఆరోగ్యం కోసం రోజు ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. వాటిలలో ఒకటి అరటిపండు. అయితే…
Tulasi Plant : హిందూమతంలో తులసి చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తులసి చెట్టుని సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ…
Ginger Tea : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే ప్రతినిత్యం ఒక కప్పు టీ తాగకుండా ఉంటే…
Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ప్రతిపక్షాలు…
Farmers : సూపర్ఫైన్ రకం వరి ఉత్పత్తి చేసే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్గా చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
This website uses cookies.