Pawan Kalyan : గత వారం రోజుల నుంచి ఏపీలో ఒకటే చర్చ. ఏపీ రాజకీయాలు ఒకేసారి యూటర్న్ తీసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్. ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి.. పవన్ పోరాటం కేవలం వైఎస్ జగన్ మీదనే. వైసీపీ మీదనే. వేరే ఎవ్వరి మీద చూపించనంత తన కోపాన్ని కేవలం వైసీపీ మీదనే చూపిస్తారు పవన్ కళ్యాణ్. టీడీపీకి కూడా కావాల్సింది అదే. అందుకే చంద్రబాబు, పవన్ కలిసి కూడా చాలా సార్లు వైసీపీ మీద యుద్ధం ప్రకటించారు. కట్ చేస్తే ప్రధాని మోదీ ఇటీవల పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
దానికి కారణం.. ఏపీలో చంద్రబాబుతో కలిసి పవన్ అడుగులు వేస్తున్నట్టు కనిపించడం. కానీ.. ఇదివరకే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కూడటం తెలిసిందే. కానీ.. ఓవైపు చంద్రబాబుతో నడవడం, మరోవైపు ప్రధాని మోదీని కలవడంపై ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ప్రధాని మోదీకి తెలిసిందే. అందుకే.. పవన్ తో భేటీ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో సందర్భంలో చంద్రబాబు గురించి చర్చించబోయారట. చంద్రబాబు గురించి పవన్ ఏదో చెప్పబోగా.. ఆ విషయాన్ని మోదీ కట్ చేసి వేరే టాపిక్ మాట్లాడారట. అంతే కాదు..
బీజేపీతో కలిసి పోరాటం చేయాలని పవన్ కు మోదీ చెప్పారట. ఇప్పుడు పొత్తుల గురించి అవసరం లేదని, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని మోదీ పవన్ కు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారట. అంటే చంద్రబాబుతో కలిసి పవన్ పయనించడం.. మోదీకి ఇష్టం లేదన్నమాట. అలాగే బీజేపీ పార్టీతో కలిసి ఏం చేయాలో.. ఎలాంటి ఉద్యమాలు చేయాలో పవన్ కు మోదీ హితబోధ చేశారట. అంటే.. పవన్, చంద్రబాబును విడదీయడం కోసమే.. మోదీ.. పవన్ తో భేటీ అయ్యారన్నమాట. అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుందా? వైసీపీ, టీడీపీని ఓడించడం కోసం బీజేపీ ఇంకా ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.