Categories: News

Modi : ప్ర‌ధానితో చంద్ర‌బాబు కీల‌క చ‌ర్చ‌లు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చారుగా..!

Advertisement
Advertisement

Modi : కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఏపీలో సానుకూలంగా ఏవి పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కేంద్రం నుండి ఏపీకి వ‌చ్చిన ప్ర‌యోజ‌నాలు ఏంట‌నేవి కూడా అర్ధం కావ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ఏపీకి కేంద్రం నుంచి సహకారం కోసం చంద్రబాబు నేరుగా ప్రధానికి పలు వినతులు అందించారు. పీఎం సైతం సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ లో విశాఖలో పర్యటన కోసం ప్రధానికి సీఎం ఆహ్వానించారు. విశాఖ కేంద్రంగా ఇద్దరు నేతలు కీలక అడుగుకు నిర్ణయించారు.పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించానని చంద్రబాబు తెలిపారు.

Advertisement

రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రాజధాని నగరం అమరావతికి మద్దతు ఇస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీకి సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ను ముందుకు తీసుకెళుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశానని వివరించారు. కొత్త రైల్వే జోన్ కు డిసెంబరులో పునాది రాయి పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పనుల చేపడుతోందని రైల్వే శాఖ మంత్రి తెలిపారని చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

Modi : ప్ర‌ధానితో చంద్ర‌బాబు కీల‌క చ‌ర్చ‌లు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చారుగా..!

విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన కు ప్రధాని వస్తున్న సమయంలోనే మరో అంశం చర్చకు కారణం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. తాజాగా కాంట్రాక్టు కార్మికుల అంశంలో తాత్కాలిక ఒప్పందం జరిగింది. అయితే, ప్లాంట్ కు నిధుల కేటాయింపు పైన స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్ లో ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పైన ఈ లోగానే స్పష్టత ఇస్తారా..ప్రధాని సమయంలో ఇచ్చేలా చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది. రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణాని కేంద్రం పచ్చజెండా ఊపింది. డిసెంబర్​లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది.

Advertisement

Recent Posts

Eatala Rajender : కేంద్రంలో ఎంపీ ఈటల రాజేంద‌ర్‌కు కీలక పదవి..!

Eatala Rajender : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్‌…

3 hours ago

pawan kalyan : రాజ‌కీయంగా ప‌వ‌న్ అజ్ఞాని అనుకుంటే బొక్క‌బోర్లా ప‌డ్డ‌టే.. స‌నాత‌నం వెన‌క అంత ప్లానా..!

pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు.ఆయ‌న ప‌ది సంవ‌త్స‌రాలుగా అధికారం…

4 hours ago

Vijayasai Reddy : ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా.. అది మ‌ర‌ల్చ‌డానికే ల‌డ్డూ వివాద‌మా?

Vijayasai Reddy : ఇటీవ‌ల ప్ర‌తి రాష్ట్రంలో కూడా ఎన్నిక‌లు చాలా ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ‌, ఏపీ ఎన్నిక‌లు రంజుగా…

5 hours ago

Divvala Madhuri : మాడ వీధుల్లో వెడ్డింగ్ షూట్ అంటూ వార్త‌లు.. ఓ రేంజ్ లో ఫైర్ అయిన మాధురి..!

Divvala Madhuri : టెక్కలి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నారు.…

6 hours ago

Nara Lokesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మానంగా లోకేశ్‌.. త్వ‌ర‌లో డిప్యూటీ సీఎం ప‌ద‌వి ?

Nara Lokesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏర్ప‌డ్డ కూటమి ప్రభుత్వంలో త్వరలోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుంది. జ‌న‌సేన అధినేత‌,…

7 hours ago

ITBP Recruitment : ITBP డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 545 ఖాళీల భ‌ర్తీకి దరఖాస్తుల ఆహ్వానం…!

ITBP Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 545 ఖాళీలతో కానిస్టేబుల్ (డ్రైవర్) కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఆసక్తి…

8 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో ఉప్పు ప్యాకెట్ ఖ‌రీదు రూ.50 వేలా.. న‌య‌ని పావని ఎందుక‌లా ఏడ్చింది..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఇప్పుడు మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. వైల్డ్…

10 hours ago

5 Habits : ఈ చిన్న తప్పులే… మన జీవితాన్ని సర్వనాశనం చేసేది తెలుసా…!!

5 Habits : మనం మన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన…

11 hours ago

This website uses cookies.