
Pregnant Women : గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త...11 వేల ఆర్థిక సాయం..!
Pregnant Women : మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అమలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఈ పథకం మహిళా మరియు శిశువు అభివృద్ధి శాఖ ద్వారా మహిళల కోసం నిర్వహించబడింది. ఇక ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి మహిళకు అనేక రకాల ప్రయోజనాలను అందించనున్నారు. అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణీలకు 11వేల ఆర్థిక సాయంం అందజేయనున్నారు. ఇక ఈ పథకం మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో వర్తిస్తుందని తెలుస్తోంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఎలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని 2017లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా దాదాపు మూడు విడతలలో 11 వేల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గర్భిణీ మహిళలకు పంపిస్తున్నారు. ఇక ఈ పథకం ద్వారా మహిళలు వారి యొక్క పిల్లలను సక్రమంగా పోషించగలరని కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా ఈ ఆర్థిక సహాయంతో పాటు గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, గర్భాదారణకు మందు మరియు వైద్య పరీక్షలు వంటి సౌకర్యాలు కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి గర్భిణీ స్త్రీలు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీ యొక్క వయసు కచ్చితంగా 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా గర్భిణీలు మరియు బాలింతలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంగన్వాడి కార్యకర్తలు , అంగన్వాడి సహాయకులు ఆశ వర్కర్లు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉండాలి.
ఈ పథకానికి అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా నిర్దిష్ట పత్రాలను కలిగి ఉండాలి. అవేంటంటే గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డు , శిశు జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువు , పాన్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , ఆదాయ ధ్రువీకరణ పత్రం , కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా https://pmmvy.wcd.gov.in లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇక ఈ అప్లికేషన్ ధృవీకరణ తర్వాత ఈ పథకం కింద మీరు పొందే ఆర్థిక సహాయం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చి చేరుతుంది.
ఈ పథకానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా మీ సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించిన ఫామ్ అంగన్వాడి కేంద్రంలో తీసుకుని మీ సమాచారాన్ని నమోదు చేసి కావలసిన పత్రాలను జత చేయాలి. ఇక వాటిని సమర్పించినప్పుడు మీకు ఒక రసీదు ఇస్తారు. ఆ రిసీదు జాగ్రత్తగా ఉంచుకోండి.
Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
Ghatkesa : ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్ డివిజన్లో నారాయణ ఫంక్షన్ హాల్ వేదికగా ముస్లిం సోదరులకు “ఈద్ కా…
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో జరిగిన గందరగోళానికి ప్రస్తుత కూటమి…
Ustaad Bhagath singh Day 1 collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan మరియు Harish…
Telangana Budget 2026-27 : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక…
Telangana Budget 2026-27 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో విద్యా రంగాన్ని అత్యంత కీలకంగా…
Battery Induction Stove : సాధారణంగా ఇండక్షన్ స్టవ్ అంటే కరెంటు ఉంటేనే పని చేసే పరికరం. నగరాల్లో ఇది…
Balineni And Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి…
Success Story : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా జాట్ తాలూకాలోని అంత్రల్ గ్రామానికి చెందిన కాకాసాహెబ్ సావంత్, సాధారణ ఆటోమొబైల్…
PM Kisan : తెలంగాణలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ప్రమాణాలను పాటించకుండా…
Gold Silver Rate 20 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న మహిళలకు, పసిడి ప్రియులకు ఇది…
This website uses cookies.