Pregnant Women : గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త…11 వేల ఆర్థిక సాయం..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Pregnant Women : గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త...11 వేల ఆర్థిక సాయం..!

Pregnant Women : మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అమలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఈ పథకం మహిళా మరియు శిశువు అభివృద్ధి శాఖ ద్వారా మహిళల కోసం నిర్వహించబడింది. ఇక ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి మహిళకు అనేక రకాల ప్రయోజనాలను అందించనున్నారు. అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణీలకు 11వేల ఆర్థిక సాయంం అందజేయనున్నారు. ఇక ఈ పథకం మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో వర్తిస్తుందని తెలుస్తోంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఎలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని 2017లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా దాదాపు మూడు విడతలలో 11 వేల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గర్భిణీ మహిళలకు పంపిస్తున్నారు. ఇక ఈ పథకం ద్వారా మహిళలు వారి యొక్క పిల్లలను సక్రమంగా పోషించగలరని కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా ఈ ఆర్థిక సహాయంతో పాటు గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, గర్భాదారణకు మందు మరియు వైద్య పరీక్షలు వంటి సౌకర్యాలు కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి గర్భిణీ స్త్రీలు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Pregnant Women అర్హతలు

ఈ పథకం పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీ యొక్క వయసు కచ్చితంగా 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా గర్భిణీలు మరియు బాలింతలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంగన్వాడి కార్యకర్తలు , అంగన్వాడి సహాయకులు ఆశ వర్కర్లు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉండాలి.

Pregnant Women : అవసరమైన పత్రాలు

ఈ పథకానికి అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా నిర్దిష్ట పత్రాలను కలిగి ఉండాలి. అవేంటంటే గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డు , శిశు జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువు , పాన్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , ఆదాయ ధ్రువీకరణ పత్రం , కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

Pregnant Women : రిజిస్ట్రేషన్..

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా https://pmmvy.wcd.gov.in లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇక ఈ అప్లికేషన్ ధృవీకరణ తర్వాత ఈ పథకం కింద మీరు పొందే ఆర్థిక సహాయం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చి చేరుతుంది.

Pregnant Women : ఆఫ్ లైన్ లో ఎలా చేసుకోవాలి

ఈ పథకానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా మీ సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించిన ఫామ్ అంగన్వాడి కేంద్రంలో తీసుకుని మీ సమాచారాన్ని నమోదు చేసి కావలసిన పత్రాలను జత చేయాలి. ఇక వాటిని సమర్పించినప్పుడు మీకు ఒక రసీదు ఇస్తారు. ఆ రిసీదు జాగ్రత్తగా ఉంచుకోండి.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి