
Raghu Rama Krishna Raju To Loose His MP Post
Raghu Rama Krishna Raju : ఇప్పటిదాకా ఏ బీజేపీ అంట తనకు వుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు చెబుతూ వస్తున్నారో, ఆ ‘లింకు’ తెగిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సొంత నియోజకవర్గం నర్సాపురంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తే, ఆ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హోదాలో రఘురామకృష్ణరాజు హాజరు కాలేకపోవడం ఆయన్ని రాజకీయాల్లో ‘జీరో’ని చేసేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, ఆ తర్వాత పార్టీకి దూరమై, పార్టీ మీద బురద చల్లుతూ వస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు. వైసీపీ ఆయనకు నచ్చకపోవచ్చు.
పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు.. పోనీ, అలా వెళ్ళకపోతే.. తన పని తాను చేసుకుపోవచ్చు. కానీ, పదే పదే.. ఒకటే పని. వైసీపీని విమర్శించడం. దానికోసం ఆయన ‘రచ్చబండ’ అంటూ ఓ చచ్చు కార్యక్రమాన్ని అను నిత్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. టీడీపీ అనుకూల మీడియాకి ఆయనో ‘బకరా’లా దొరికినట్టున్నారు. లేకపోతే, కేవలం ఆ మీడియా మాత్రమే ఆయన్ని ఎందుకు వాడుకుంటుంది.? టీడీపీ అనుకూల మీడియా దెబ్బకి చాలామంది రాజకీయ జీవితాలు సమాధి అయిపోయినమాట వాస్తవం.
Raghu Rama Krishna Raju To Loose His MP Post
అది తెలిసీ, రఘురామ ఆ పచ్చ మీడియాకి ఎలా చిక్కారో ఏమో.! తన గురించి తాను చాలా ఎక్కువ ఊహించేసుకోవడం రఘురామకి అలవాటే. కానీ, ఈసారి ఆయన బొక్కబోర్లా పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోలేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లెక్క చేయలేదు. ఇంకో రెండేళ్ళపాటు ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళే అవకాశమూ కనిపించడంలేదు. అసలంటూ ఆయనకు ఎంపీ పదవి అప్పటిదాకా వుండాలి కదా.? రఘురామ మీద అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ మరింతగా ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. అతి త్వరలో ఆ ముచ్చటా తీరిపోనుందట.
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
This website uses cookies.