revanth reddy fires on trs govt about srinivas rao issue
Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో పోడు భూముల సమస్య చర్చనీయాంశం అయింది. పోడు భూములను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తాజాగా ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఆయన స్పందించారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ హత్యే అని.. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతోనే ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తామని దాదాపుగా గత ఎనిమిదేళ్ల నుంచి ప్రభుత్వం ఊరిస్తూ వస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు పోడు భూములపై అతీగతీ లేదు.. అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వేలాది మంది గిరిజనులపై కేసులు పెట్టారని.. పోడు భూములు సాగు చేస్తున్న రైతులు.. ఎన్ని పోరాటాలు చేసినా.. ఉద్యమాలు చేసినా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నేళ్లు అవుతోంది.
revanth reddy fires on trs govt about srinivas rao issue
ఇప్పటి వరకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఎందుకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కారానికి కమిటీని కూడా నియమించారు కదా.. ఆ కమిటీ ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.. పోడు రైతులపై, పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. గుత్తికోయల దాడిలో అధికారి చనిపోవడం చాలా బాధాకరమైన ఘటన అని తెలిపారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.