Home » News » Revanth Reddy Vs Mallareddy In Live
News

లైవ్ లో ఫామ్ హౌస్ గుట్టు విప్పిన మల్లారెడ్డి.. ఎంత పనిచేశావయ్యా మల్లన్న..

Authored By
Brahma
The Telugu News | Updated on: May 5, 2021 5:25 pm
Advertisement

తెరాస మంత్రి MallaReddy వ్యవహారం గురించి అందరికి తెలుసు.. ఆయనకు ఆవేశం వస్తే ఏమి మాట్లాడుతాడో కూడా ఆయనకే తెలియదని చాలా మంది సరదాగా అంటుంటారు. అలాంటి మనిషి ఏకంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లాంటి నేతతో లైవ్ లో వాదనకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి.

Advertisement

 

నిన్న ఒక ప్రముఖ ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో రేవంత్ రెడ్డి పాల్గొని మల్లారెడ్డి మీద అతని అల్లుడి మీద, అతని బావమరిది మీద ఆరోపణలు చేయటమే కాకుండా ఎవరి మీద ఎంతెంత భూములు ఉన్నాయో.. దేవస్థానాల భూముల్లో ఫామ్ హౌస్ లు కట్టుకొని తిరుగుతున్నారని, మల్లారెడ్డి కాలేజీలు కు కూడా చెరువులను ఆక్రమించి కట్టారంటూ విమర్శలు చేశాడు .

Advertisement

revanth-reddy-vs-mallareddy-in-live

ఇవన్నీ మల్లారెడ్డి చూశాడో, లేకపోతె అనుచరులు చెప్పారో కానీ, స్టూడియో వాళ్ళు అడగకుండానే ఫోన్ లైన్ లోకి వచ్చాడు మల్లారెడ్డి. వచ్చి రావటంతోనే రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతూ, నువ్వు మాగోడివి అయితే అవి రుజువు చేయి, నాకు ఏడూ ఎకరాలు అన్నావు కదా..? దమ్ముంటే నిరూపించు..? అవే నిజమైతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. అవి అబద్దం అయితే నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా అంటూ సవాల్ విసిరాడు..

Advertisement

ఈ క్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఫామ్ హౌస్ లాంటివి మాకేమి లేదు.. మా అల్లుడు మా బావమరిదికి కూడా అవేమి లేవంటూ చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి వదిలిపెట్టకుండా అటు తిప్పి ఇటు తిప్పి సర్వే నంబర్లు, భూమి వివరాలు అన్ని చెపుతూ మల్లారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశాడు.. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మల్లారెడ్డి అవునండి అక్కడ ఫామ్ హౌస్ ఉంది, అది మా బావమరిదిది, నాది కాదు దానితో నాకు సంబంధం లేదని చెప్పాడు. ముందు అసలు అక్కడ ఫామ్ హౌస్ లేదు దమ్ముంటే చూపించమని చెప్పిన మల్లారెడ్డి కాసేపటికి ఫామ్ హౌస్ ఉంది కానీ నాది కాదంటూ అసలీ గుట్టు చెప్పాడు.

revanth-reddy-vs-mallareddy-in-live

ఇక్కడ విశేషం ఏమిటంటే మల్లారెడ్డి బావ మరిది కూడా తెరాస లోని కీలక నాయకుడే, పైగా ఆ ఫామ్ హౌస్ దేవాదాయ శాఖకు చెందిన భూమిలో అక్రమంగా కట్టారు.. ఈ కోణంలో చూసుకున్న అది ముమ్మాటికీ తప్పు కిందకే వస్తుంది. మా బావమరిదిది నాకేమి సంబంధం లేదని మల్లారెడ్డి బుకాయించిన కానీ లాభం లేదు. ఎందుకంటే ఎవరు ఏమిటో జనాలకు బాగానే తెలుసు.. అయిన సరిగ్గా వాదన చేయటం చేతకాకపోతే సైలెంట్ గా ఉంటే బాగుంటుంది కానీ, ఇలా లైవ్ లోకి వచ్చి పరువు తీసుకోవటం అవసరమా అనే కామెంట్స్ నెటిజన్ల నుండి వినిపిస్తున్నాయి.

Brahma

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి