తిరుపతి ఉప ఎన్నికల్లో YSRCP విజయం సాధించింది, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ…. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ కి ఆత్మపరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇచ్చాయనే చెప్పాలి. మొదటిగా ఈ ఉప ఎన్నికల్లో ఐదు లక్షల మెజారిటీ సాధించాలని జగన్ టార్గెట్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి, కానీ చివరికి 2,71,592 ఓట్ల మెజారిటీ దక్కింది. 2019 తో పోల్చి చూస్తే 43,216 ఓట్ల అదనపు మెజారిటీ వచ్చింది.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో 7.22 లక్షల ఓట్లు వస్తే, ఇప్పుడు 6.26 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి, అంతే సుమారు ఒక లక్ష ఓట్లు దాక తగ్గాయి. ఆ లక్ష ఓట్లు వైసీపీవే అయినప్పుడు ఆ ఓటర్లని ఎందుకు వైసీపీ నేతలు పోలింగ్ బూత్ దాక తీసుకోని రాలేకపోయారు అనేది ఇక్కడ గమనించాలి.
రాష్ట్రంలో సగం మంత్రులను తిరుపతిలో మోహరించాడు జగన్, దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన కానీ వైసీపీ ఓట్లు వైసీపీ రాలేదంటే దానిని ఏ కోణంలో చూడాలి. టీడీపీకి కూడా ఓట్లు తగ్గాయి కాదని అనుకోవచ్చు, ఎలాగూ ప్రతిపక్షమే కదా దానిని ఓట్లు వేసిన లాభం లేదనే ఒక నిర్లక్ష్యంతో టీడీపీ ఓటర్లు ఓటింగ్ కి దూరంగా ఉండవచ్చు, అదేమీ సమస్య కాదు. కానీ వైసీపీ పరిస్థితి అలా కాదు..
జగన్ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారని వైసీపీ నేతలు బలంగా చెపుతున్నారు, అదే నిజం అనుకుంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు పెట్టి వైసీపీకి ఓట్లు వేయాలి కదా..? ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే గతంలో కంటే ఈ సరి వైసీపీ కి 1000 ఓట్లు అధికారంగా వచ్చాయి. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఆరు వేల నుండి 22 వేల వరకు ఓట్లు తగ్గాయి.. ఈ పరిణామం పై వైసీపీ నేతలు ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే.. 2019 పొలోమంటూ ఓట్లు వేసిన జనాలు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు.. జగన్ మీద వ్యతిరేకత వచ్చిందా..? లేక స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత వచ్చిందా..? అనే దానిపై వైసీపీ పెద్దలు ఒక క్లారిటీకి రావాలి .
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.