Rohit Sharma : నా వైపు చూస్తావేంటంటూ సుందర్పై రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
Rohit Sharma : ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. మందకొడి పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. సిరాజ్, దూబె, కుల్దీప్ యాదవ్, వాష్టింగ్టన్ సుందర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 230 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో మ్యాచ్ టై అయింది. భారత బ్యాటింగ్లో రోహిత్ శర్మ(47 బంతుల్లో 58) హాఫ్ సెంచరీ బాదగా, కేఎల్ రాహుల్ (31), అక్షర్ పటేల్ (33), శివమ్ దూబె (25) లు రాణించడంతో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఈ టోర్నీకి సూపర్ ఓవర్ నిబంధన లేకపోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ, చరిత్ అసలంక చెరో మూడు వికెట్లు తీశారు. దునిల్ వెల్లలాగే రెండు వికెట్లు పడగొట్టాడు. అసిత ఫెర్నాండో, అఖిల దనంజయ లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా ఇన్నింగ్స్ 29వ ఓవర్ను వాషింగ్టన్ సుందర్ వేశాడు. ఈ ఓవర్లోని ఐదో బంతిని లంక బ్యాటర్ దునిత్ వెల్లలగే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. బంతి అతడి ప్యాడ్లను తాకింది.
Rohit Sharma : నా వైపు చూస్తావేంటంటూ సుందర్పై రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
ఎల్బీడబ్ల్యూ కోసం బౌలర్ సుందర్తో పాటు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశాడు. అయితే.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అయితే రివ్యూకి వెళ్లాలా అని స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూశాడు సుందర్ . రివ్యూకి వెళ్లాలా అంటూ రోహిత్ అడిగాడు. అయితే.. సుందర్ కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయాడు. నీకేమనిపిస్తుందని అన్నట్లుగా రోహిత్ వైపు చూశాడు. ఇంకో వైపు రివ్య్వూ తీసుకునేందుకు సమయం ముగిసి పోతుండడంతో సుందర్ పై రోహిత్ సీరియస్ అయ్యాడు. ఏంటీ… నా వైపు ఎందుకు చూస్తున్నావు. అయినా నాకేం కనిపిస్తుందని అడుగుతున్నావు..? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా..? అంటూ గట్టిగా అన్నాడు రోహిత్. ఆ వెంటనే నవ్వేశాడు. రోహిత్ వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.