
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్న్యూస్.. పీఎం కిసాన్తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !
Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు Telangana farmers ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్ Yasangi season ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయోనని గ్రామాలన్నింటిలో ఒకే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా విడుదలపై ఆశలు పెట్టుకున్నా జనవరిలో జమ కావాల్సిన సొమ్ము వివిధ కారణాలతో నిలిచిపోయింది. దీంతో సాగుకు కావాల్సిన పెట్టుబడి కోసం farmers రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా ఇంకొందరు అగ్రికల్చర్ లోన్లపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్న్యూస్.. పీఎం కిసాన్తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం Central government రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం pm kisan yojana కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనుంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తవడంతో ఇక నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా 22వ విడత పీఎం కిసాన్ సొమ్మును విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు పంపించనున్నారని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ కారణంగా ఆలస్యం అయిన ఈ చెల్లింపులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.
కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా Rythu Bharosa నిధుల జమకు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన రైతు భరోసా సొమ్ము శాటిలైట్ సర్వే కారణంగా ఆలస్యమైంది. సాగులో ఉన్న భూముల గుర్తింపుకు చేపట్టిన ఈ సర్వే ఇటీవల పూర్తవ్వగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ సర్వే ప్రకారం దాదాపు 10 శాతం భూముల్లో ప్రస్తుతం పంట సాగు జరగడం లేదని వెల్లడైంది. ఆ భూములకు రైతు భరోసా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా అర్హులైన రైతులకు మాత్రం ఫిబ్రవరి చివరికల్లా ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా జమ చేయనున్నారు. ఇలా పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు దాదాపు ఒకేసారి రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉండటంతో ఈ నెల రైతులకు ‘డబుల్ బొనాంజా’గా మారనుంది. కేంద్రం నుంచి రూ.2 వేలు రాష్ట్రం నుంచి ఎకరానికి రూ.6 వేలు అందడంతో రైతులకు కొంత ఊరట కలగనుంది. పెట్టుబడి భారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నిధులు సాగుకు మళ్లీ ధైర్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే ఫిబ్రవరి చివరి వారంలో నిజంగానే ఈ నిధులు ఖాతాల్లో పడతాయా? అన్నదానిపైనే.
కృషి విజ్ఞాన కేంద్రం (KVK), గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల రెండోవ వారంలో షెడ్యూల్డ్ కులాల (SC)…
Municipality Elections : ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు,…
Tamannaah Bhatia : చిత్రసీమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ..తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం…
Under 19 World Cup 2026 : అండర్-19 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు Indian team అద్భుత ప్రదర్శన…
Girlfriend Murdered Her Boyfriend : ఇటీవల కొంతమంది మహిళలు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా…
Bhumika : 'యువకుడు' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన భూమిక.. 'ఖుషి', 'ఒక్కడు', 'సింహాద్రి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్…
Ram Charan Peddi Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ పాన్-ఇండియా…
This website uses cookies.