
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్న్యూస్.. పీఎం కిసాన్తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !
Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు Telangana farmers ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్ Yasangi season ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయోనని గ్రామాలన్నింటిలో ఒకే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా విడుదలపై ఆశలు పెట్టుకున్నా జనవరిలో జమ కావాల్సిన సొమ్ము వివిధ కారణాలతో నిలిచిపోయింది. దీంతో సాగుకు కావాల్సిన పెట్టుబడి కోసం farmers రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా ఇంకొందరు అగ్రికల్చర్ లోన్లపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్న్యూస్.. పీఎం కిసాన్తో పాటే రైతు భరోసా.. అకౌంట్లోకి డబ్బులు.. తేదీ ఖారారు !
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం Central government రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం pm kisan yojana కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనుంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తవడంతో ఇక నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా 22వ విడత పీఎం కిసాన్ సొమ్మును విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు పంపించనున్నారని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ కారణంగా ఆలస్యం అయిన ఈ చెల్లింపులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.
కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా Rythu Bharosa నిధుల జమకు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన రైతు భరోసా సొమ్ము శాటిలైట్ సర్వే కారణంగా ఆలస్యమైంది. సాగులో ఉన్న భూముల గుర్తింపుకు చేపట్టిన ఈ సర్వే ఇటీవల పూర్తవ్వగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ సర్వే ప్రకారం దాదాపు 10 శాతం భూముల్లో ప్రస్తుతం పంట సాగు జరగడం లేదని వెల్లడైంది. ఆ భూములకు రైతు భరోసా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా అర్హులైన రైతులకు మాత్రం ఫిబ్రవరి చివరికల్లా ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా జమ చేయనున్నారు. ఇలా పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు దాదాపు ఒకేసారి రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉండటంతో ఈ నెల రైతులకు ‘డబుల్ బొనాంజా’గా మారనుంది. కేంద్రం నుంచి రూ.2 వేలు రాష్ట్రం నుంచి ఎకరానికి రూ.6 వేలు అందడంతో రైతులకు కొంత ఊరట కలగనుంది. పెట్టుబడి భారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నిధులు సాగుకు మళ్లీ ధైర్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే ఫిబ్రవరి చివరి వారంలో నిజంగానే ఈ నిధులు ఖాతాల్లో పడతాయా? అన్నదానిపైనే.
Realme 5G : భారతదేశంలో స్మార్ట్ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
Gold Silver Rate 22 March 2026 : బంగారం కొనాలనుకునే సామాన్యులకు, పసిడి ప్రియులకు ఇది నిజంగా పెద్ద…
Fruits for summer : ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మన శరీరం అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే క్రమంలో ఎక్కువగా…
Summer Drinks : వేసవి కాలం మొదలైతేనే తీవ్రమైన ఉష్ణోగ్రతలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి. అధిక వేడి…
Saunf Water : మారుతున్న వాతావరణ పరిస్థితులు, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అలాగే అధికంగా మసాలా ఆహారాలు తీసుకోవడం వల్ల…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా నమోదవుతున్న అక్రమ కేసుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక…
Dhurandhar 2 : ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 సినిమా ఏ రేంజ్లో రచ్చ చేస్తోందో…
Supreme court : సుప్రీం కోర్టు ఇటీవల ఒక కీలకమైన కేసులో భార్యాభర్తల బంధం గురించి చాలా గొప్ప మాటలు…
Ration Card : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడుతున్న…
Garikapati Narasimha Rao : ప్రవచనకర్తగా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న గరికపాటి నరసింహారావు ఈ మధ్య తన నోటి…
Ysrcp : ఆంధ్రరాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి.…
This website uses cookies.