Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సిద్దమైన రేవంత్ సర్కార్.. మున్సిపల్ ఎన్నికల కోసమే అంటున్న ప్రతిపక్షాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సిద్దమైన రేవంత్ సర్కార్.. మున్సిపల్ ఎన్నికల కోసమే అంటున్న ప్రతిపక్షాలు

 Authored By sudheer | The Telugu News | Updated on :3 February 2026,9:00 pm

Rythu Bharosa  : తెలంగాణలోని Telangana సాగు రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల  rythu bharosa funds  విడుదలకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి సంక్రాంతి పండుగకే ఈ నిధులు అందుతాయని ఆశించినా, సాంకేతిక కారణాలు మరియు అర్హుల గుర్తింపు ప్రక్రియ వల్ల ఆలస్యమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి మూడో వారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.

అయితే ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని చూడటం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికే ప్రభుత్వం ఈ సమయాన్ని ఎంచుకుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Rythu Bharosa రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సిద్దమైన రేవంత్ సర్కార్ మున్సిపల్ ఎన్నికల కోసమే అంటున్న ప్రతిపక్షాలు

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సిద్దమైన రేవంత్ సర్కార్.. మున్సిపల్ ఎన్నికల కోసమే అంటున్న ప్రతిపక్షాలు

Rythu Bharosa: రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు

ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. గతంలో సాగులో లేని భూములకు, కొండలు, గుట్టలకు కూడా నిధులు వెళ్లాయనే ఆరోపణలు ఉండటంతో, ఈసారి శాటిలైట్ సర్వే (Remote Sensing) ఆధారంగా కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికోసం వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ కొత్త నిబంధన వల్ల గతంలో లబ్ధి పొందిన వారిలో కొందరికి ఈసారి నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. నిజమైన సాగు రైతుకే మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా, నిధుల కోత కోసమే ప్రభుత్వం కొత్త సాకులు వెతుకుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisement

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది