Crime News : సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. వావి వరసలు లేకుండా.. మనుషులు మృగాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను చంపేసే పిల్లలు… అక్రమ సంబంధాల విషయంలో పెళ్లి చేసుకున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తున్న వ్యక్తులు ఇలా చాలామంది ఎక్కువైపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తల్లిదండ్రులను వదిలి తన జీవితమే భర్తతో అని కాపురానికి వచ్చిన భార్యని…ఓ భర్త స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడటం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన అఖిలేష్ ధర్మరాజు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక వసంత్ పూర్ నివాసి అయిన మహిళ అతడిని మ్యాట్రిమోనీలో చూసి.. కొన్నాళ్లు మాట్లాడి పరిచయం ఏర్పరచుకుని ఆ తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించుకుని 2019లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం దంపతులు హెచ్ఎస్ఆర్ లే అవుట్ లో నివసిస్తున్నారు. పెళ్లి చేసుకున్న ప్రారంభంలో బాగానే ఉన్న భర్త ఆ తర్వాత అతనిలో మార్పులు రావడం జరిగింది. స్నేహితులతో కలిసి గంజాయి మరియు డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ తర్వాత భార్యని అత్యంత కిరాతకంగా హింసించేవాడు.
అంత మాత్రమే కాదు స్నేహితులతో కలిసి పడుకోవాలని చిత్రవాద చేసి కొట్టేవాడు. ఒక్కోసారి సిగరెట్లతో కాల్చేవాడు. ఇక ఇదే సమయంలో డ్రగ్స్ తీసుకున్న స్నేహితులు భర్త ఎదురుగానే ఆమెను లైంగికంగా వేధించేవారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి భర్త అత్యాచారానికి పాల్పడుతుండగా ఒక్కసారిగా తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరుకుని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసు తర్వాత ఆమెపై వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయి. కేసు విత్ డ్రా చేసుకోవాలని.. నిత్యం వేధించేవారు. దీంతో బాధిత మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగటంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి తదుపరి విచారణ చేపడుతున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.